మంత్రి వర్గ విస్తరణ అనంతరం అన్ని జిల్లాల్లోని టీడీపీ వర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రగిలాయి. సీనియర్లు అలకబూనడం.. అనంతరం వారిని బుజ్జగించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. కానీ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు జిల్లాలో మాత్రం ఇవి ఇంకా నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన, బాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు సీనియర్లు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేగాక చంద్రబాబుకు, వారికీ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. […]