టీడీపీ కీలక నేత, ఆ పార్టీ మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన చంద్రబాబు కేబినెట్లో అటవీ శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబుపై అలిపిరి ఘటనలో బాంబు దాడి జరిగినప్పుడు బొజ్జల కూడా గాయపడ్డారు. కొద్ది రోజుల క్రితం బొజ్జల పుట్టిన రోజు […]