ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఒక్కసారిగా యూపీలో బీజేపీ జెండా రెపరెపలాడిన దగ్గర నుంచి..ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు జరుగుతున్నాయి. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం రోజున.. బద్ధ శత్రువులైన ఎస్పీ అధినేత ములాయంసింగ్, ప్రధాని మోదీ చాలాసేపు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది జరిగిన కొద్దిరోజులకే ములాయం చిన్న కొడుకు, కోడలు పార్టీని వీడతారనే ప్రచారం అక్కడి మీడియాలో జోరందుకుంటోంది. వీరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, ఈ మేరకు బీజేపీ […]