కరోనా మహమ్మారి ఒకవైపు విజృంభిస్తున్నది. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. జనం బయట అడుగుపెట్టాలంటేనే జంకుతున్నారు. ఇదే అదునుగా పలు ప్రైవేట్ వైద్యశాలలు చెలరేగిపోతున్నాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా ఇప్పటికే కొవిడ్ కారణంగా ఉపాధి, ఉద్యోగాలను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లోనూ జనాల రక్తాన్ని పీల్చుతున్నాయి. ట్రీట్మెంట్ పేరిట దోచుకుంటున్నాయి. ప్రైవేట్ దవాఖానల దాష్టికానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఈ సంఘటన. హైదరాబాద్లోని అల్వాల్ కి చెందిన రామారావు అనే పెద్దాయన ఇటీవల అస్వస్థతకు […]