ఒడిశా సీఎంకు జ‌గ‌న్ లేఖ‌.. కీల‌క ప్ర‌తిపాద‌న‌

న‌వ‌ర‌త్నాల పేరుతో సంక్షేమ ప‌థ‌కాల‌తో దూసుకుపోతున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభివృద్ధి పైనా దృష్టి సారించారు. అంద‌రి మ‌న్న‌న‌ల‌ను అందుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల‌ను కూడా ప‌రుగులు పెట్టిస్తున్నారు. గ‌తంలో చేప‌ట్టిన ప్రాజెక్టుల‌నే కాకుండా నూత‌న ప్రాజెక్టుల‌కు శ్రీ‌కారం చుట్టేందుకు చ‌క‌చ‌కా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. కీల‌క ప్ర‌తిపాద‌న చేశారు. ఒడిశా, ఏపీ ప‌క్క‌ప‌క్క రాష్ట్రాలు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. […]