వైసీపీలో ఇద్ద‌రు టాప్ లీడ‌ర్ల మ‌ధ్య ఫైటింగ్‌…. చిన్న గ‌ది కోస‌మేనా..!

వైసీపీలో వారిద్ద‌రూ కీల‌క నాయ‌కులు. పైగా.. ఎస్సీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు. దీంతో వారికి సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది. అంతేకాదు.. ఇద్ద‌రికీ కూడా.. కీల‌క‌మైన ప‌ద‌వులు ఇచ్చి గౌర వించారు. అయితే.. ఇప్పుడు ఆ ఇద్ద‌రే.. సెంట‌రాఫ్‌ది టాక్ అయ్యారు. వారే.. ఒక‌రు మేరుగ నాగార్జున‌.. మ‌రొక‌రు.. జూపూడి ప్ర‌భాక‌ర్‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ.. కీల‌క స్థానాల్లో ఉన్నారు సాంఘిక సంక్షేమ శాఖ‌కు మేరుగ నాగార్జున మంత్రిగా ఉన్నారు. ఇక‌.. జూపూడి ప్ర‌భాక‌ర్‌.. […]

ఈ ఒక్క మాట‌తో వైసీపీ బెంబేలెత్త‌తోందా.. ఆ మాట ఇదే…!

గ్రామీణ స్థాయిలో వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. అర్బ‌న్ స్థాయిలో మాత్రం ఒకింత ఇబ్బందిగానే ఉం దని పార్టీ అధిష్టానానికి.. నివేదిక‌లు అందాయని తెలిసింది. ప్ర‌స్తుతం పార్టీ త‌రఫున నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర మాలు.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్న‌నాయ‌కులు.. ఇలా.. అనేక కోణాల్లో వైసీపీ అధిష్టానం స‌ర్వే నివేదిక‌లు సేక‌రించింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో నెల నెలా 1నే పింఛ‌న్ అందుతుండ‌డంపై ప్ర‌జ‌లు ఆనందం గానే ఉన్నారు. ఇక ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ ఇంతే హ్యాపీ క‌నిపిస్తోంది. అయితే.. అది […]

చిరు ప్ర‌క‌ట‌న‌తో వైసీపీలో ఫుల్ హుషారు…!

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌ల్లో కొత్త హుషారు చోటు చేసుకుందట‌. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి నాయ‌కులు ఆస‌క్తిగా చ‌ర్చించు కుంటున్నార‌ట‌. ఇప్పుడు ఏపీలో ఇలాంటి చ‌ర్చే జ‌రుగుతోంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి ? ఎందుకు? అనుకుంటున్నారా? తాజాగా మెగా స్టార్ చిరంజీవి చేసిన ప్ర‌క‌ట‌నే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అదేంటి? వైసీపీకి పోటీ ఇచ్చేలా.. అధికారం ద‌క్కించుకునేలా.. జ‌న‌సేన‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటాన‌ని చిరు ప్ర‌క‌టిస్తే.. అది వైసీపీకి మైన‌స్ కదా.. మ‌రి ఆ పార్టీ […]

దూసుకెళ్లే జర్నీలో ఈ సడన్ బ్రేకుల లెక్కేంది జగన్..?

హైవే మీద వాహనం దూసుకెళుతున్న వేళ.. అవసరం లేకున్నా సడన్ బ్రేక్ వేస్తే ఏమవుతుంది? సాఫీగా సాగే జర్నీలో సడన్ బ్రేకుతో లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అన్న ప్రశ్న వేస్తే సమాధానం ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఈ సడన్ బ్రేక్ కారణంగా జరిగే నష్టం ఊహించటానికి వీల్లేని రీతిలో ఉంటుంది. తెలివి ఉన్న వారెవరూ.. ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోరు. హైవే మీద మాంచి వేగంతో వెళ్లే బండిని సడన్ బ్రేక్ వేస్తే.. […]

చిన్న నిర్ణ‌యాలు.. పెద్ద న‌ష్టాలు.. మారేదెప్పుడు జ‌గ‌న్‌..?

ఎక్క‌డైనా ఏ ప్ర‌భుత్వ‌మైనా.. తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు.. ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర‌గొనాల‌ని చూస్తుంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల సెంటిమెంటుకు అనుకూలంగానే ప‌నిచేస్తుంది. దీంతో మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు పొరుగున ఉన్న తెలంగాణ , త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ఇవే క‌నిపిస్తున్నాయి. తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఆరోగ్య శ్రీప‌థ‌కాన్ని మార్చాల‌ని.. కేసీఆర్ అనుకున్నారు. తొలిసారి ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన ఆయ‌న‌.. తెలంగాణ రాకుండా.. అడ్డుకున్న వైఎస్‌ను తీవ్ర‌స్థాయిలో తిట్టిపోశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పెట్టిన […]

ఇదేం రాజ‌కీయం.. జుట్టంతా వైసీపీ చేతికి ఇస్తున్నారే….!

ఏమో అనుకుంటారు కానీ.. రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాలు కూడా.. తెర‌మీదికి వ‌స్తు న్నాయి. ఒక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఓడించాల‌నే దృఢ‌మైన నిర్ణ‌యం తీసుకున్న పార్టీలు.. ఏవైనా.. చా లా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించేవి. ప్ర‌త్య‌ర్థి పార్టీల లోపాల‌ను ప‌సిగ‌ట్టి.. సైలెంట్‌గా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువె ళ్లేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఈ రాజ‌కీయాలు మారిపోయాయి. ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధాలు అందిస్తున్న‌ట్టుగా.. నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికార పార్టీని తీసుకుంటే.. వైసీపీ అధినేత .. జ‌గ‌న్‌.. చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. […]

సీఎం జ‌గ‌న్ అస‌హ‌నం.. మంత్రి వ‌ర్గం మార్పు ఖాయం..?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మ‌ళ్లీ మంత్రి వ‌ర్గ‌కూర్పుపై త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రుగుతోంది. ఇటీవ‌లే.. పీకే టీం స‌భ్యుడు.. మంత్రుల‌కు సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టును సీఎం జ‌గ‌న్‌కు అందించిన‌ట్టు తెలిసింది. దీనిలో మంత్రులు చాలా వ‌ర‌కు మౌనంగా ఉన్నార‌ని.. వారి వ‌ల్ల ప్ర‌భుత్వానికి మైలేజీ ద‌క్క‌డం లేద‌ని.. చెప్పారు. దీంతో జ‌గ‌న్ కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల‌పై ప్ర‌త్యేకంగా ఆయ‌న దృష్టి పెట్టారు. అస‌లు ఎంత మంది మంత్రులు యాక్టివ్‌గా ఉంటున్నారు? ఎంత […]

2024 ఎన్నిక‌ల్లో గెలుపే టార్గెట్‌గా జ‌గ‌న్ తెర‌చాటు వ్యూహం… దిమ్మ‌తిరగాల్సిందే..!

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. అనేక అనుమానాల‌కు తావిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. రాజ‌ధాని విష‌యం.. ఇప్పుడు ఆమూలాగ్రం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఒక‌వైపు.. రాజ‌ధాని రైతులు మ‌హాపాద‌యాత్ర 2.0ను ప్రారంభించారు. కేంద్రం రాజ‌ధానిపై చ‌ర్చిద్దాం.. ర‌మ్మ‌ని పిలుపునిచ్చింది. మూడు రాజ‌ధానులు కాదు.. ఒకే రాజ‌ధాని అని.. రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. ద‌రిమిలా.. మూడు రాజ‌ధానుల‌కే త‌మ మొగ్గు అంటూ.. మంత్రులు, నాయ‌కులు.. ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ ప్ర‌భుత్వం.. ఏం […]

టీడీపీ స‌వాల్‌ను స్వీక‌రిస్తారా… జ‌గ‌న్ కు పెద్ద ప‌రీక్షే..!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే.. ఈ స‌మావేశాల‌ను ఐదు రోజుల‌కే ప‌రిమితం చేసి నా.. ప్ర‌భుత్వ వ్యూహం మాత్రం మ‌రోలా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మ‌రోసారి.. రాజ ధాని అమ‌రావ‌తి గురించిన చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఒక‌వైపు రైతులు పాద‌యాత్రను తిరిగి ప్రారంభించారు. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు ఈ యాత్ర సాగ‌నుంది. అయితే.. దీనిని త‌మ‌పై చేస్తున్న దండ యాత్ర‌గా వైసీపీ ఉత్త‌రాంధ్ర ప్ర‌జాప్ర‌తినిధులు ఆరోపించారు. అంతేకాదు.. మూడు రాజ‌ధానుల‌ను ఎవ‌రూ క‌ట్ట‌డి […]