పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్ లోనే తొలిసారి మైథలాజికల్ సబ్జెక్ట్ ను టచ్ చేస్తూ చేసిన చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్వకత్వం వహించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. సన్నీ సింగ్, దేవదత్తా నాగె తదితరులు కీలక పాత్రలను పోషించారు. […]