`ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్‌ లుక్ అదిరిపోయిందిగా!!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిశోర్‌ తిరుమల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై చెరుకూరి సుధాకర్‌ నిర్మిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర వేగంగా జ‌రుగుతోంది. అయితే నేడు ద‌స‌రా పండ‌గా సంద‌ర్భంగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్‌ లుక్ ను తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేశారు. […]