ఏపీలో ఘోరం జరిగింది. ముగ్గురాయి గనిలో పేలుడు వద్ద ప్రమాదం చోటుచేసుకోవడంతో 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం కడపజిల్లాలోని కలసపాడు మండలంలో చోటుచేసుకుంది. ముగ్గురాయి గనిలో కార్మికులు ముగ్గురాయి తొలగించేందుకు జిలిటెన్ స్టిక్స్ పేలుస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు వల్ల కొందరి పరిస్థితి విషమంగా తయారైంది. జిలిటెన్ స్టిక్స్ వాహనంలో తీసుకువస్తుండగా, ప్రమాదవశాత్తు పేలినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురాయి గనిలో పనుల కోసం […]