దేశంలో ఓ వైపు కరోనాకేసులు పెరుగుతుంటే మరో వైపు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల చాలా మందే ప్రాణాలను కోల్పోతున్నారు. నేడు తమిళనాడులోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. కడలూర్ నుంచి చిదంబరం వెళ్లే మార్గంలో ఉన్న చిప్కార్డ్ కాంప్లెక్స్లో 30కి పైగా ప్రైవేట్ కర్మాగారాలు పనిచేస్తున్నాయి. వీటిలో ఓ పురుగుమందుల కంపెనీలో గురువారం ఉదయం మంటలంటుకున్నాయి. ఫ్యాక్టరీలోని ఒక మెషిన్ సడెన్గా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దాంతో ఫ్యాక్టరీ అంతా మంటలు […]