ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులపై కొనసాగుతున్న రగడ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిపై అమరావతి రైతులు ఇప్పటికీ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అయితే జగన్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూడు రాజధానుల గొడవ మళ్లీ రాజుకుంది. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై మాట్లాడారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చని ఆయన వెల్లడించారు. ఈ ఏడాదని ప్రత్యేకంగా చెప్పలేము […]