తిరుమల తిరుపతి దేవస్థానం…. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. నిత్యం లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. కోట్ల రూపాయల ఆదాయం, వేల కోట్ల ఆస్తులు.. ఎన్నో ధార్మిక సంస్థలను చేయుత అందిస్తూ… లక్షల మందికి ఉచితంగా ఎన్నో సేవలు అందిస్తున్న సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ధార్మకి సంస్థకు ఛైర్మన్, బోర్డు మెంబర్ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. దీనిపై ఇప్పుడు రాజకీయ […]
Category: AP
బాబు నోట… పదే పదే అదే మాట… వారే టార్గెట్…!
చంద్రబాబు నాయుడు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే మాట ఒకటే… తమ్ముళ్లు… హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను… ఈ సెల్ఫోన్ నేనే తీసుకువచ్చాను… ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ… అధికారంలో ఉన్నప్పుడు… ఆ తర్వాత కూడా చంద్రబాబు ఇదే మాట పదే పదే చెప్పుకొచ్చారు. ఒకదశలో టీడీపీ అభిమానులు… ఇంకా ఎంతకాలం ఇలా చెప్తారు సార్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఇక ప్రతిపక్ష నేతలైతే… హైదరాబాద్ అంతకు ముందు లేదా.. అంటూ సూటిగా ప్రశ్నించారు కూడా. […]
తిరుపతి లడ్డూ వివాదం… కాంగ్రెస్ – బీజేపీ వార్…!
అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూ తయారీ వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య వివాదానికి తెర లేపింది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి దాదాపు 50 ఏళ్లుగా కర్ణాటక పాల సరఫరా సమాఖ్య ఆవు నెయ్యి సరఫరా చేస్తోంది. ఒక దశలో తిరుమల లడ్డూకు అంత రుచి రావడానికి కారణం కర్ణాటక పాల సరఫరా సమాఖ్య సరఫరా చేసే నందిని బ్రాండ్ ఆవు నెయ్యి అని గతంలో తిరుమల తిరుపతి […]
విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎవరు పోటీ చేస్తారో తెలుసా…?
రాజకీయాలకు పుట్టిలుగా విజయవాడకు పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం విజయవాడ పార్లమెంట్ సహా ఏపీ – తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల గురించి ఎక్కువగానే చర్చ జరుగుతుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. అందులో 3 విజయవాడ సిటీ పరిధిలోనే ఉంటాయి. ఇక రెండు నియోజకవర్గాలు ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఉంటాయి. దీంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతూనే ఉంటాయి. తాజాగా విజయవాడ పార్లమెంట్ సహా పరిధిలోని […]
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమేనా….!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 9 నెలలు గడువుంది. 2019 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగగా… మళ్లీ 2024 ఏప్రిల్ వరకు జగన్ సర్కార్కు గడువుంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా అప్పుడే ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తొలి నుంచి ప్రతిపక్షాలు తమ శ్రేణులను అలర్ట్ చేస్తున్నాయి. అటు అధికార పార్టీ నేతలు సైతం… ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే ప్రకటనలు […]
పవన్ మూడో విడత వారాహి యాత్ర.. ముహుర్తం ఖరారైందా…!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే వైసీపీని ఓడించాలనేది పవన్ లక్ష్యం. ఇందుకోసం అన్ని ప్రతిపక్షాలను కలుపుకుని పోతామని కూడా పవన్ వెల్లడించారు. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న పవన్… 2019 ఎన్నికల్లో మాత్రం కమ్యునిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశారు. కానీ కేవలం ఒక్కటే నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచింది. రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ సైతం ఇప్పుడు వైసీపీకి […]
గిద్దలూరు వైసీపీలో ఫుల్ క్లారిటీ… మళ్లీ ఆయనే పోటీ….!
ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 90 వేలకు పైగా మెజారిటీ రాగా… ఆయన తర్వాత స్థానంలో పార్టీ సీనియర్లను కాదని… గిద్దలూరు నియోజకవర్గం నుంచి అన్నా రాంబాబు నిలిచారు. ఏకంగా 81 వేల ఓట్ల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నేతల జాబితాలో […]
ఆ రెండు పార్టీలకు ఫుల్ పబ్లిసిటీ… మరి తమ్ముళ్ల పరిస్థితి….!
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. అదే బ్రో సినిమా. వాస్తవానికి ఆ సినిమాలో కేవలం ఓ రెండు నిమిషాల సేపు మాత్రమే పృద్వీరాజ్ క్యారెక్టర్. అది కూడా ఓ పాటలో భాగం. అక్కడ పృద్వీ వేసే డ్యాన్స్…. ఆ సీన్లో పవన్ చెప్పే డైలాగ్ ఇప్పుడు ఏపీలో ట్రెండింగ్ టాపిక్. పృద్వీ వేసిన స్టెప్పులు సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటల చుట్టూ అంబటి రాంబాబు వేసినట్లుగా ఉందని అంతా పోల్చారు. […]
మంగళగిరికి మకాం మార్చేసిన పవన్ కల్యాణ్….!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరికి మకాం మార్చారు… నిన్న, మొన్నటి వరకూ హైదరాబాద్లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా మంగళగిరికి తరలించారు. ఇక సినిమా షూటింగ్లకు మాత్రమే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాలకు వెళతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. జనసేన తన కార్యకలాపాలను ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించనుంది. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు, జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరికి చేరుకున్నారు. హైదరాబాద్లో ఉన్న పార్టీ కేంద్ర […]