ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ… ముందస్తు పుకార్లు వినిపిస్తున్నాయి. గతానికి పూర్తి భిన్నంగా నేతలంతా ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇక నియోజకవర్గ స్థాయి నేతలైతే ఎన్నికల్లో టికెట్ కోసం అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. కీలక నియోజకవర్గాల్లో కూడా ఈ సారి టీడీపీ గెలుపు కష్టమనే మాట బలంగా వినిపిస్తోంది. రాజధాని పరిధిలో తమకు తిరుగు లేదని […]
Author: Ravi
సిక్కోలు టీడీపీలో ఆధిపత్య పోరు… రింగ్ లీడర్ గ్రూప్ పాలిటిక్స్…!
సిక్కోలు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రంగంలో ఎవరుంటారు అనే చర్చ జోరుగా నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. వై నాట్ 175 అని జగన్ అంటుంటే… వై నాట్ పులివెందుల అని చంద్రబాబు అంటున్నారు. ఇదే మాటను స్ఫూర్తిగా తీసుకుని ఇరుపార్టీల నేతలు జనంలో విస్తృతంగా తిరుగుతున్నారు. వైసీపీ తరఫున సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు లేదా ఆయన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పోటీ […]
పేరు రాబిన్ శర్మది… పెత్తనం మాత్రం ఆ నేతదే…!
తెలుగుదేశం పార్టీ నేతల జాతకం మొత్తం రాబిన్ శర్మ చేతుల్లో ఉంది అనేది బహిరంగ రహస్యం. నిజమే…. తెలుగుదేశం పార్టీ నేతల పనితీరు గురించి ప్రతి నెలా రాబిన్ శర్మ టీమ్ సర్వే నిర్వహించి… పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాబిన్ శర్మ టీమ్ పని చేస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే నేతల గెలుపు ఓటములతో పాటు బలబలాల గురించి కూడా […]
విజయవాడ ఎంపీ టికెట్ ఎవరికో క్లారిటీ వచ్చిందా….!?
విజయవాడ ఎంపీగా ప్రస్తుతం కేశినేని నాని వ్యవహరిస్తున్నారు. 2014లో తొలిసారి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన నాని… 2019లో సైతం వైసీపీ హవాలో కూడా ఎంపిగా గెలిచి తన సత్తా ఏమిటో చూపించారు. అయితే తర్వాత కాలంలో నాని తీరు పలు విమర్శలకు తెర లేపింది. ప్రధానంగా విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల నాటి నుంచి కూడా నాని తీరుపై పార్టీ అధిష్ఠానం గుర్రుగా ఉందనే చెప్పాలి. నాని కుమార్తె శ్వేత కార్పొరేటర్గా పోటీ […]
బండి సంజయ్ను పూర్తిగా పక్కన పెట్టినట్లేనా….!
బండి సంజయ్… తెలంగాణలో ఓ ఫైర్ బ్రాండ్… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గుర్తింపు వచ్చిందంటే.. అది బండి వల్లే అనేది బహిరంగ రహస్యం. ఇప్పటి వరకు ఒక లెక్క… ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా… బండి సంజయ్కు ముందు సైలెంట్గా ఉన్న బీజేపీ… రాష్ట్ర అధ్యక్షునిగా బండి బాధ్యతలు చేపట్టిన తర్వాత… ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఎంపీగా ఉన్న బండి.. పార్టీని గాడిలో పెట్టారనేది అక్షర సత్యం. సీనియర్ల మాట వింటూనే… […]
జగన్ సర్కార్కు విద్యుత్ ఉద్యోగులు షాక్ ఇస్తారా…!
వేతన సవరణ విషయంలో జగన్ సర్కార్కు విద్యుత్ శాఖ ఉద్యోగుల షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భోజన విరామ సమయంంలో నిరసనలు చేస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడేది లేదంటున్నారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు వేరు.. విద్యుత్ కార్పొరేషన్ల ఉద్యోగులు వేరు. వీరికి ప్రత్యేక ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వీరికి విద్యుత్ సంస్కరణల వల్ల భారీ ప్రయోజనం కలిగింది. అయితే.. జగన్ ప్రభుత్వం వచ్చాక అంతంత జీతాలు అవసరమా అన్నట్లుగా ట్రీట్ […]
ప్రాజెక్టుల బాట పట్టనున్న చంద్రబాబు…!
టీడీపీ అధినేత త్వరలో ప్రాజెక్టుల బాట పడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మూలనపడ్డ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. వైసీపీ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించనున్నారు. సాగు, త్రాగు నీరు అందించే ప్రాజెక్ట్లపై జగన్ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మూలన పడిన ప్రాజెక్ట్లు, ప్రభుత్వం ఆయా ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించకుండా వ్యవహరిస్తున్న తీరును.. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను చంద్రబాబు ప్రజలకు వివరించారు. మూడు […]
ఆర్మీ పాలనలోకి మరో దేశం..!
ఆర్మీ పాలనలోకి మరొక దేశం చేరింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్లో తిరుగుబాటు జరిగింది. దేశ రాజధాని నియామెలో జరిగిన ఈ తిరుగుబాటుకు అక్కడి సైన్యం మద్దతు తెలిపింది. ప్రెసిడెన్షియల్ గార్డ్స్ సభ్యులు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్ ను, ఆయన భార్యను నిర్బంధించారు. ఆర్మీ అధికారులు ఆ దేశ పాలనపై పట్టుసాధించారు. ఇక నుంచి తామే దేశాన్ని పాలించనున్నామని ప్రకటించారు. దేశంలో పాలనా వ్యవహారాలను సైన్యమే చూసుకుంటుందని, ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని స్పష్టం […]
గంటా నియోజకవర్గం ఏదో ఫుల్ క్లారిటీ….!
గంటా శ్రీనివాసరావు… ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న రాజకీయ వేత్త. చిన్నస్థాయి నుంచి వచ్చిన గంటా… ఒక జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారనేది వాస్తవం. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన గంటా శ్రీనివాసరావు… ఇప్పటి వరకు 5 సార్లు పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతిసారి గెలవడమే గంటా ప్రత్యేకత. 1999లో తొలిసారి అనకాపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన గంటా […]