ఇండస్ట్రీలో హీరోయిన్లు అడుగుపెట్టి సక్సెస్ సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఎన్నో కష్టాలు, అవమానాలు, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు కమిట్మెంట్ ఇవ్వాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు.. తాము క్యాస్టింగ్ కౌచ్ సైతం ఎదుర్కొన్నామంటూ తమ ఎక్స్పీరియన్స్లు వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే.. కొంతమంది హీరోయిన్లు మాత్రం వాళ్ళు స్టార్లుగా ఎదిగేందుకు.. మార్కెట్ మరింతగా పెంచుకోవడానికి.. ఆస్తులను కూడబెట్టుకోవడానికి ఇష్టంగానే ఇలాంటి కమిట్మెంట్లకు ఒప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు డబ్బులు సంపాదనకు ఎలాంటి మార్గాన్ని అయినా వదులుకోవడానికి ఇష్టపడరు. తాజాగా మనం చెప్పుకోబోతున్న ఈ స్టార్ హీరోయిన్ కూడా అదే కొవ్వుకు చెందుతుందట.
ఇంతకీ ఆమె ఎవరో కాదు కాయదు లోహర్. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ.. మొదట మోడల్గా కెరీర్ ప్రారంభించి.. తర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. అదేంటంటే.. తాస్మాక్ స్కామ్ నిందితులతో కలిసి పార్టీ చేస్తుందంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే ప్రస్తుతంఈ తాస్మాక్ స్కామ్.. తమిళనాడు రాష్ట్రంలో కలకలం రేపుతున్న సంఘటన తెలిసిందే. ఇందులో పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, టెస్ట్ టెలరీ ఓనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంత పెద్ద స్కాం నిందితులతో.. ఖయాదులోహర్ నైట్ పార్టీ ఎందుకు పాల్గొంది.. అనే సందేహాలు అందరిలోనూ వచ్చే ఉంటాయి.
అయితే.. ఈ పార్టీకి ఆమెకు ఏం సంబంధం లేదు. కానీ.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని సామెతను అమ్మడు బాగా వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మంచి ఫేమ్ ఉన్న నేపథ్యంలో.. నైట్ పార్టీలలో పాల్గొనేందుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట కాయదు లోహర్. ఈ క్రమంలోనే తాస్మాక్ స్కామ్.. నిందితులు నిర్వహించిన నైట్ పార్టీలలో లోహర్ పాల్గొనేందుకు సైతం ఓకే చేసిందట. ఈ పార్టీ కోసం అమ్మడు ఏకంగా రూ.35 లక్షలు తీసుకుందని టాక్ తెగ వైరల్ గా మారుతుంది. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. డబ్బు ఇస్తే ఇలాంటి వాళ్ళు ఎలాంటి పని చేయడానికి అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారంటూ.. నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ ఆమెపై మండిపడుతున్నారు నేటిజన్స్.