ఎస్ ప్రస్తుతం ఇదే న్యూస్ వైరల్ గా మారింది. బాలకృష్ణకు తన ఇద్దరు కూతుళ్లు బ్రహ్మణి, తేజస్విని చుక్కలు చూపిస్తున్నారు అంటూ.. వాటికి కారణం కొడుకు మోక్షజ్ఞనే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు ఈ గొడవలకు కారణం ఏంటో ఒకసారి చూద్దాం. నందమూరి నటసింహం బాలయ్యకు ముగ్గురు పిల్లలన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూతుళ్లు, ఒక అబ్బాయి. నందమూరి ఫ్యామిలీ సిద్ధాంతం ప్రకారం అమ్మాయిలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. అలా ఎన్టీఆర్ కూతుళ్లు, మనవరాలు ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. కనీసం నిర్మాణం, దర్శకత్వం వైపు కూడా వారు రాకపోవడం ఎన్టీఆర్ కుమారులు మనవళ్లు మాత్రమే హీరోలు, నిర్మాతలుగా రాణిస్తున్నారు. అయితే ప్రస్తుతం తరం మారడంతో.. ఆలోచన విధానాన్ని కూడా మార్చారు.. అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. టాలీవుడ్ హీరోల కూతుళ్లు హీరోయిన్స్ కావడం మనం ఇప్పటికే చూస్తున్నాం.
మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక, యాంగ్రీ హీరో రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక.. అర్జున్ సర్జ కుమార్తె ఐశ్వర్య ఇలా ఎంతోమంది ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్లు పనిచేస్తున్నారు. కాగా బాలకృష్ణ కుమార్తెలు కూడా టాలీవుడ్ లో అడుగు పెట్టి ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. అయితే హీరోయిన్గా కాకుండా.. నిర్మాతలుగా వారు కొనసాగాలని అనుకుంటున్నారట. చిన్న కుమార్తె తేజస్విని ఇప్పటికే ఇండస్ట్రీలో దిగారంటూ.. వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను చేస్తున్న ప్రాజెక్టులు తేజస్విని నిర్మాణ భాగస్వామిగా ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక బ్రాహ్మణి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. పలు వ్యాపారాల్లో తన సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం నిర్మాణరంగం వైపు అడుగు వేయాలని భావిస్తుందట.
ఈ క్రమంలో మోక్షజ్ఞను లాంచ్ చేసే సినిమా విషయంలో తాను ప్రొడ్యూసర్ గా ఉండాలని భావిస్తుందట. బాలకృష్ణ ఎప్పటినుంచో వారసుడు మోక్షజ్ఞను హీరోగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ప్రయత్నాలు కార్యరూపం దాల్చుతున్నాయి. ఏడాదిలోనే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ పక్కా అని తెలుస్తుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ తో పాటు మరికొందరు దర్శకులను.. బాలకృష్ణ తాజాగా సంప్రదించారని.. కథ కూడా సిద్ధంగా ఉందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు బ్రాహ్మణి, తేజస్విని ఇద్దరు పోటీ పడుతున్నారని.. ఇద్దరు కూతుర్లలో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక బాలయ్య సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు మోక్షజ్ఞ ప్రాజెక్ట్ బాలయ్యకు పెద్ద తలనొప్పిగా మారిందని నెట్టింట వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.