టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ గత కొంతకాలంగా హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తు దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా ఈగిల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ మేకర్స్ వివరించారు. అయితే ఇటీవల ఈగల్ సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. సంక్రాంతికి నెలకొన్న భారీ పోటీ నేపథ్యంలో ఈగిల్ రిలీజ్ పోస్ట్పోన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ పుకార్లు ప్రొడక్షన్ హౌస్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొట్టి పడేసింది.
ఈగిల్ను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. జనవరి 13న ఈగల్ సినిమా రిలీజ్ కాబోతుందట. ఈగిల్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్గా వ్యవహరించాడు. సూర్య వర్సెస్ సూర్య తర్వాత మళ్లీ ఇంత కాలానికి మాస్ మహారాజ్ ఈగిల్తో మెగా ఫోన్ పట్టాడు.. కార్తీక్ ఘట్టమనేని. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు రవితేజ షూటర్ పాత్రలో మెప్పించబోతున్నాడు. ఈగిల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థోఫర్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నవదీప్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నాడని టాక్.
ఇక ప్రస్తుతం సంక్రాంతిలో మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, తేజ హనుమాన్, నాగార్జున నా సామి రంగ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మహేష్ బాబు, నాగార్జున స్టార్ హీరోలు కావడంతో వీరు సినిమాలకు ఎలాగూ థియేటర్స్ ఉంటాయి. వెంకటేష్ కు అన్న సురేష్ బాబు, ఏషియన్ ఫిలిమ్స్ వారి సహకారంతో థియేటర్స్ కు కొదవ ఉండదు. ఇక తేజ హనుమాన్ సినిమా రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుగానే థియేటర్లను మాట్లాడుకున్నారు. దీంతో రవితేజ ఈగిల్కు థియేటర్లు దొరకడమే కష్టం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఏదేమైనా రవితేజ ఈగిల్ సినిమాతో సంక్రాంతి బరిలో పోటీకి రెడీ అవ్వడంతో సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది.