ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయం వల్లే టాలీవుడ్ పరిశ్రమ ఇంతలా మారిందా..?!

సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోలుగా వీరిద్దరూ రాణించారు. ఇక సౌత్ ఇండస్ట్రీలో తెలుగు వారంతా ఎంతో గ్రాండ్గా ఎక్కువ రోజులు జరుపుకునే పండుగ సంక్రాంతి. ఏటా ఈ పండుగల‌ రోజున సినిమాలను విడుదల చేసేవారు. అయితే ఈ విధానం వల్ల రెండు సినిమాలకు ఆడియన్స్ తో పాటు గ్రాస్ వ‌సుళ‌లో లాభాలు రేట్ కూడా తగ్గుతుందని విష‌యాని ఎన్టీఆర్ గుర్తించాడు. పండగల టైంలో సినిమాలను ఎక్కువమంది చూడరు. అప్పట్లో ఎవరి ఇంట్లో వాళ్లు పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని భావించేవారు.

పండుగ లేని టైంలో సినిమా వాళ్లకు ప్రేక్షకులు తాకిడి అంత‌గా ఉండేది కాదు. అయితే ఈ విషయాన్ని గమనించిన సీనియర్ ఎన్టీఆర్ సంక్రాంతి పండుగకు నెలరోజులు ముందుగా డిసెంబర్ నెలలోనే తన సినిమాలు రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు పెద్ద ప్ల‌స్ అయ్యింది. ఎన్టీఆర్ సినిమాలను అభిమానులు మిస్ కాకూడదని ఆలోచనలో ఉండేవారు. రెగ్యులర్ రోజుల్లో కూడా ఆయన సినిమాలు విడుదలయ్యాయి. ఖాళీ ఉన్న సమయంలో ప్రేక్షకులు సినిమా చూడడానికి థియేటర్స్‌కు వెళ్లేవారు.

సినిమా మంచిగా ఉంటే ఎక్కువ మంది వెళ్లేవారు. సినిమాకు మంచి గ్రాస్ వ‌శుళ్ళు వచ్చేవి. దీంతో ఎన్టీఆర్ పాపులారిటీ మరింతగా పెరిగింది. తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని కథానాయకుడిగా మారాడు. ఎన్టీఆర్ ఈ నిర్ణయం వల్ల నిర్మాతలకు కూడా తమ సినిమాలను పండగలుపై ఆధారపడకుండా.. అన్ని సీజన్లో రిలీజ్ చేసుకోవడానికి బూస్టర్ అయింది. కొత్త కథలు, పాత్రలు యాక్టర్స్ పెరగడంతో సినిమాల జానెర్స్, బడ్జెట్ కూడా పెరిగింది. తెలుగు ఇండ‌స్ట్రీ కూడా తన మార్కెట్ తమిళనాడు లాంటి పక్క ప్రాంతాలకు విస్తరించింది.

ఇక దీంతో తమిళ్ లో కూడా ఎన్టీఆర్ సినిమాలు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అయ్యాయి. సినిమా వసుళ్ళు భారీగా పెరిగాయి. అలా ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి ఎన్టీఆర్ దూర దృష్టితో తీసుకున్న నిర్ణయం చాలా తోడ్పడింది. ఇక ఏఎన్ఆర్ కూడా టాలీవుడ్ పరిశ్రమ మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం వారిద్దరి వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ రేంజ్‌లో ఉంది. ఇక ఇటీవల రాజమౌళి, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లు టాలీవుడ్ ఇండస్ట్రీని గ్లోబల్ రేంజ్ కు తీసుకువెళ్లారు.