కెప్టెన్ కావడానికి తన కష్టం లేదని నోరుజారిన రైతుబిడ్డ.. ప‌రువు తీసుకున్నాడంటూ..!!

బిగ్ బాస్ 7 షోలో ఊహించని వ్యక్తి రెండో కెప్టెన్ అయ్యాడు. అయితే తామే కెప్టెన్ అయిపోతామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రం బరస్ట్ అయిపోయారు. వాళ్లకు ఏడుపు ఒకటే తక్కువైంది. అదే టైంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నోరుజారాడు. పరువు అంతా పోగొట్టుకున్నాడు. ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో శుక్రవారం ఏం జరిగిందో ఉప్పుడు చూద్దాం.

క్యాప్టెన్సీ టాస్క్ లో భాగంగా పోటుగాళ్లతో ఆటగాళ్లు సమానం కావడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. రాత్రి నిద్రపోయే టైంలో శివాజీ తో పిచ్చపాట్టి కబుర్లు ఆడుతూ ప్రశాంత్ నోరుజారాడు.” కెప్టెన్సీ వచ్చింది అన్నవల్లనే.. నేను చేసిందేం లేదు ” అని అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎంత మోటివేట్ చేసిన గేమ్స్ ఆడింది, క్యాప్టెన్సీ సంపాదించుకుంది ప్రశాంత్ కానీ శివాజీకి క్రెడిట్ ఇచ్చేసి తన ప‌రువు తనే తీసుకున్నాడు.

ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా చివరగా ” హూ ఇస్ ది బెస్ట్ ” అనీ గేమ్ పెట్టాడు. ఫుట్‌బాల్ లాంటి బంతిని చేతులతో గోల్ పోస్టులో వేయాల్సి ఉంటుంది. కింద మీద పడి ఆటగాళ్లు విన్నయ్యారు. దీని అనంతరం పూజ, అశ్విని మధ్య గొడవ జరిగింది. చివరగా రెండో వారం క్యాప్టెన్సీ బ్యాచ్ను దక్కించుకుంది ఎవరో కాదు ప్రిన్స్. ఇక్కడితో శుక్రవారం ఎపిసోడ్ కంప్లీట్ అయింది.