పల్లవి ప్రశాంత్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎంత పాపులారిటీ ద‌క్కించుకుంటున్నాడు. హౌస్‌ లోపలికి రావడానికి మినీ యుద్ధమే చేసిన ఈ రైతుబిడ్డ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అదే రేంజ్ లో టాస్క్ లలో చెలరేగిపోతున్నాడు. మొదటి వారం ర‌తికరోజ్‌ మాయలో పడి కొద్దిగా తడబడినప్పటికీ.. తరువాత గురువు శివాజీ సలహాలతో తేరుకొని టాప్ కట్టిస్టెంట్గా రాటుదేలాడు. అసమాన ఆట తీరు చూపించి బిగ్ బాస్ సీజన్ 7 తొలి కెప్టెన్గా మారడు. హౌస్ లో చాలామంది రైతు బిడ్డను తక్కువ చేసి చూసేవారు.

ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ చేసిన అతి అంతా ఇంతా కాదు. వారు మాట్లాడిన మాటలే పల్లవి ప్రశాంత్ ను హీరోని చేశాయి. రెండు ముఖాలు.. రెండు ముఖాలు అంటూ చెప్పిన కంటెస్టెంట్లు అంతా ఇప్పుడు ముఖాలు దాచుకుంటున్నారు. పల్లవి ప్ర‌శాంత్‌ నామినేషన్‌లో ఉన్నాడంటే చాలు ఓట్లు గుద్దేస్తున్నారు జనం. కొంతమంది బయట ప్రశాంత్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వారికి చాలా పొలం ఉందని.. నాలుగు కార్లు ఉన్నాయని.. కోటేశ్వరుడని న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని తప్పుపడుతూ పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు వారికి ఉన్న ఆస్తి వివరాలపై క్లారిటీ ఇచ్చారు.

తమ‌కి కేవలం 6 ఎకరాల పొలం మాత్రమే ఉందని ఒక్క కారు కూడా లేదని పొలం దున్నుకునేందుకు ట్రాక్టర్ మాత్రం ఉందని చెప్పుకొచ్చారు. కొంతమంది కావాలనే తమ కుటుంబం పై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు మాట్లాడుతూ మా బిడ్డ బిగ్ బాస్ లోకి వచ్చిన డబ్బు పేద రైతులకు ఇస్తామనడం మాకు చాలా సంతోషాన్ని కలిగించిందని.. అమర్దీప్ మా బిడ్డను తిట్టడం మాత్రం మా మనసును బాధపెట్టిందంటు చెప్పుకొచ్చారు. 13 ఏళ్ల నుంచి ప్రశాంత్ వ్యవసాయ పనులు చేసేవాడని తమ పేరెంట్స్ వెల్లడించారు. అలాగే తమ బిడ్డ తల్లిదండ్రులను ఎప్పుడు బాధ పెట్టలేదని వివరించారు.