చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు దాదాపు అందరూ మొహం కాంతివంతంగా ఉండాలని మెరుస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి చర్మం జిడ్డుగా ఉండే సమస్య ఏర్పడుతూ ఉంటుంది. అలా చర్మం పొడిబారకుండా, జిడ్డు సమస్యలు పోయి మృదువుగా, కాంతివంతంగా మారాలంటే చిన్ని చిన్ని టిప్స్ ను ఫాలో అయితే సరిపోతుంది.
ముఖం కాంతివంతంగా ఉండాలంటే రెండు టీ స్పూన్ల కీరదోసరసంలో, రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని రెండు స్పూన్ల ముల్తానీ మట్టితో కలిపి ఫేస్ కు అప్లై చేసుకుని 20 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుకోవాలి. అలా చేస్తే ఫేస్ కాంతివంతంగా కనిపిస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మెరుస్తూ కోమలంగా మారుతుంది.