తెలుగులో బిగ్ బాస్ షోకు ఆదరణ పెరుగుతూనే ఉండడంతో నిర్వాహలకు సీజన్ల మీద సీజన్లు తీస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఏడో సీజన్ కూడా మొదలైంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చి ఎన్నడూ లేని విధంగా సరికొత్త టాస్కులతో ఆకట్టుకుంటుంది.
అయితే శని, ఆదివారం నాగార్జున ఎంట్రీ ఉంటుందనే విషయం తెలిసిందే. కానీ తాజా ఎపిసోడ్ కు సంబంధించిన షోలో ఇంటి సభ్యులకు బాగానే చమట్లు పట్టించాడు కింగ్.. ఈ వీక్ నామినేషన్ సందర్భంగా ప్రశాంత్ పై అమర్ దీప్ అరవడంపై మాట్లాడిన నాగార్జున..” అతని డబ్బులు అతని ఇష్టం. అతడు ఎవరికైనా ఇచ్చుకుంటాడు నీకెందుకు? అని అన్నాడు.
ఆ తర్వాత ప్రశాంత్ కు కూడా క్లాస్ పికాడు. ఎందుకంటే.. హౌస్ లోకి వెళ్ళినప్పుడు పల్లవి ప్రశాంత్ కు నాగార్జున ఓ మొక్క ఇచ్చాడు. కానీ ఆ మొక్కని కాపాడుకోలేకపోయాడు ప్రశాంత్. అది ఆకులు రాలిపోయి.. పూర్తిగా ఎండిపోయింది. దీంతో నాగార్జున..”ఒక మొక్కను సరిగ్గా చూసుకోలేకపోయావు నువ్వు రైతుబిడ్డవా ” అని విమర్శించాడు. దీంతో ప్రశాంత్ ముఖం మాడిపోయింది.