ఆ ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి మల్టీస్టారర్..

కలలో కూడా ఊహించిన ఎన్నో అదిరిపోయే కాంబినేషన్ ఇటీవల మనం టాలీవుడ్‌లో చూస్తూనే ఉన్నాం. దశాబ్దాలుగా బాక్స్ ఆఫీస్ వద్ద నందమూరి, మెగా కుటుంబాల ఫాన్స్ మధ్య వార్ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి ఆ రెండు కుటుంబాల నుంచి వచ్చిన మూడో జనరేషన్ స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటించారు. అది కేవలం రాజమౌళి దర్శకత్వంలోనే జరిగింది. నిజంగానే ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై ఊహించని రేంజ్ లో కమర్షియల్ హిట్ సొంతం చేసుకుంది. రూ.1000 కోట్ల భారీ గ్రాస్‌వ‌శుళ‌ను సొంతం చేసుకుని ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులను, ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకుంది.

ఇలా ఈ సినిమాతో తెలుగువాడి ఖ్యాతిని రెట్టింపు చేశారు రాజమౌళి. ఇప్పుడు అదే రేంజ్ లో మరో సూపర్ హిట్ కాంబినేషన్కు శ్రీకారం చుట్టపోతున్నాడట‌. పాన్ ఇండియా లువ‌ల్‌లో సూపర్ స్టార్ హీరోస్ ఎవరు అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది షారుక్ ఖాన్, రజనీకాంత్ ఇద్దరికీ స‌రైన‌ సినిమాలు వస్తే బాక్సాఫీస్ వద్ద విద్వాంశం ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఇటీవల వచ్చిన జైలర్, జవాన్ సినిమాల రిజ‌ల్ట్‌తో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు ఇప్పుడు రాజమౌళితో చేతులు కలిపి ఒకే సినిమాలో చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మన ఊహలకు కూడా అందని రేంజ్ లో ఆ సినిమా ఉంటుంది.

అలాంటి అసాధ్యమైన కాంబినేష‌న్‌ని అతి త్వరలోనే రాజమౌళి తెర‌పైకి తీసుకురాబోతున్నాడ‌ట‌. ఈ న్యూస్ త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తాడ‌ని స‌మాచారం. ఇక ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా రూపొందించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది ప్రారంభం నుంచి గాని ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది. ఈ సినిమా తర్వాత రజిని, షారుక్ తో మల్టీ స్టార‌ర్ సినిమాను ప్రారంభించడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నాడట. రాజమౌళి తండ్రి స్వయంగా మహేష్ సినిమా తర్వాత మహాభారతాన్ని రాజమౌళి తీయబోతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఈ రెండిట్లో ఏది ముందు జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.