వయసు పైబడుతున్న వారిలో మధుమేహం, గుండెనొప్పి రాకుండా పాటించాల్సిన టిప్స్ ఇవే..!

నడి వయసు, ఆపై వయసులోకి వెళుతున్నప్పుడు కొన్ని రకాల ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అనారోగ్యాలను నివారించి శరీరాన్ని ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంచుకోవాలంటే పెద్ద వయసు వారికి కొన్ని రకాల పోషకాలు అత్యవసరం.

పీచు ప‌ద్ధార్దాలు:
పీచు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మలబద్దకం సమస్యని నివారించుకోవచ్చు. పీచు ఉన్న ఆహారం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్ వంటివి అధికంగా తీసుకుంటే పీచు లభిస్తుంది.

త‌గినంత నీరు:
వయసు పెరిగినప్పుడు దాహం తక్కువగా అనిపిస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గిన ఆ విషయం త్వరగా తెలియకపోవచ్చు. కనుక తగినంత నీరు తాగుతుండాలి. నీరు శరీరానికి చాలా ముఖ్యం. మీరు ఎక్కువగా తాగడం వల్ల మానసిక అలజడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు.

ఇవి అనారోగ్యాన్ని ఆపుతాయి:
వయసు పెరుగుతున్న కొద్దీ పెద్ద‌ వారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ కాలంలో ఎక్కువగా గుండెజబ్బు, మధుమేహం, క్యాన్సర్ ని నివారించే శక్తి మన శరీరంలో ఉండాలి. శక్తి పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు తినాలి.. బాదం, వాల్నట్, జీడిపప్పు, పిస్తా పప్పు వంటి నట్స్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో తగినంత శక్తి ఏర్పడుతుంది. అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా చూసుకుంటాయి.

క్యాల్షియం ఎక్కువగా ఉండాలి:
వయసు పెరుగుతున్న కొద్దీ క్యాల్షియం తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటిని నివారించాలంటే కాల్షియం అధికంగా ఉన్న పాలు, పాల నుంచి వచ్చే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

మెదడు ఆరోగ్యం కోసం:
సహజంగా ప్రస్తుత రోజుల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా మెదడు సమస్యలు వస్తున్నాయి. సరైన ఆహారం తినకపోవడం, ఎక్కువగా ఆలోచించడం లాంటి సమస్యలతో మెదడు గాయపడుతుంది. దీనికి కావాల్సిన ఆహారం తీసుకుంటే మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది. అవి ఏంటంటే.. ఆరంజ్ రంగుల్లో ఉన్న పళ్ళు, కూరగాయలు తీసుకోవడం ద్వారా లైకోపీన్ ఎక్కువగా పొందవచ్చు. ఇది కొన్ని రకాల వ్యాధులను నివారిస్తుంది. ఎక్కువగా పళ్ళు, కూరగాయలు తీసుకుంటే మెదడు ఆరోగ్యవంతంగా ఉంటుంది.