మహేష్ బాబు సినిమా ‘ గుంటూరు కారం ‘ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మీనాక్షి చౌదరి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మేరకు సూర్య కిరణాల వెలుతురులో రోడ్డుపై నడుస్తున్న ఫోటోను ఇన్స్టాలో షేర్ చేస్తూ…’ కష్టం, సుఖం, పరిస్థితి ఏదైనా చిరునవ్వుతో ముందుకుసాగాలి. నా జీవితం ఏమి పూల పాన్పు కాదు.
నా జీవితం ఏమి పూల పాన్పు కాదుకొన్నేళ్లు కితం ఎన్నో భావుద్వేగాలతో నా లైఫ్ రోలర్ కోస్టర్ రైడ్లా సాగింది.
ఎన్నోసార్లు కింద పడ్డాను.. అయినా స్వయం కృషితో మళ్లీ బలంగా తిరిగి లేచా… అలా ఆత్మపరిశీలనతో జీవితాన్ని చూసే విధానం మారింది. ప్రతి దశలోనూ చిరునవ్వు నాకు తోడుగా ఉంది. కాలంతోపాటు రోజు పరిస్థితులు కూడా మారుతూయనే విషయం అర్థమైంది.
కాబట్టి మన లైఫ్ లో కష్టాలు ఎదురవుతున్న ప్రతిసారి చిరునవ్వు చిందించిన క్షణాలను గుర్తు చేసుకోవాలి’ అంటూ రాస్కొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె నటిస్తున్న గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా హిట్ అయితే మీనాక్షికి మరిన్ని అవకాశాలు క్యూ కడతాయి అనడంలో సందేహంలేదు.
View this post on Instagram