నేటి విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలు, తెలివి తేటాలతో అనేక పనుల్లో తమ సత్తా చాటుతున్నారు. అలాగే ద్వారకాతిరుమలలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా తన సత్తా చూపించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీవారి దేవస్థానం సంస్కృత ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధి బ్యాటరీ బైక్ తయారు చేసి తన ప్రతిభ చాటాడు.
కొమ్మర గ్రామానికి చెందిన మండా దిలీప్ కుమార్ స్థానిక పాఠశాలలో గతేడాది పదో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం నల్లజర్ల మండలం దోపిచర్ల ఎలైట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక పాఠశాలలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థుల సహాయంతో అతడు ఓ బ్యాటరీ బైక్ తయారుచేసి తన సత్తా చాటాడు.
ఇంటర్ విద్యార్థి ఇంత పెద్ద విజయాన్ని సాధించడంతో తన తోటి విద్యార్థులు, తల్లిదండ్రులతో సహా పలువురు దిలీప్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవటంతో అతడి ప్రతిభకి నెట్టిజన్స్ షాక్ అవుతున్నారు.