చాలామంది కొన్ని రకమైన ఆహారాలు తీసుకునే ముందు అవి ఎలా తినాలో తెలుసుకోరు. సరిగ్గా తినకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల ఏ పదార్థమైన ఎలా తినాలో తెలియాలి. కొన్ని ఆహారాలను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టి తినాలి.
నీటిలో కొన్ని గంటలపాటు నానబెట్టడం వల్ల వాటిలో పోషక విలువలు మరింత పెరుగుతాయి. ఈ ఆహారాలను నానబెట్టి మాత్రమే తినాలి. ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాదం ను రాత్రంతా నానబెట్టి.. ఉదయం పొట్టు తీసి తినాలి.
వాల్ నట్స్ ను కూడా రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలి. వాల్ నట్స్ పిల్లల బ్రెయిన్ చురుగ్గా పని చేసేందుకు సహాయపడుతుంది. ఎండి ద్రాక్షాను కూడా నేరుగా తినకూడదు. నానబెట్టి తినడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు మన శరీరానికి అందుతాయి.