గుంటూరు కారం సినిమాకి ఆ పని మాత్రం చేయొద్దు అంటున్న మహేష్.. ప్లాన్ అదిరిపోయిందిగా గురు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కు అతడు, ఖ‌లేజా లాంటి మంచి సినిమాలు ఇచ్చిన తర్వాత మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా గుంటూరు కారం. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ సినిమా నుంచి ఎప్పటికి ఒక టీజర్ మరో పాస్టర్ తప్ప మరి ఏ అప్డేట్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇక మరీ ముఖ్యంగా ఈ నెల 9న మహేష్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ చేస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ అదేమీ చేయకుండా కేవలం గుంటూరు కారం సినిమాలోని మహేష్ మాస్ లుక్ పోస్టర్‌ను ఒకటి వదిలారు.

శ్రీమంతుడు, మహర్షి, సర్కారు వారి పాటా లాంటి క్లాసిక్ విజయాలు తర్వాత మహేష్ చేస్తున్న పక్క మాస్ సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో మహేష్ లుక్‌ క్లాస్ గా కనిపిస్తున్న డైలాగులు, నటన ఎంతో మాస్ గా డిజైన్ చేశారట దర్శకుడు త్రివిక్రమ్. ఇక దాంతో ఈ సినిమాపై అంచనాలు ఎవరు ఊహించిన విధంగా ఉన్నాయి. కానీ అంచనాలను మరింత పెరగాలంటే సినిమాకి తప్పకుండా మంచి ప్రమోషన్ ఉండాలి. ఈ క్రమంలోని సినిమా యూనిట్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాకి అప్పుడే ప్రమోషన్స్ మొదలు పెట్టవద్దు అని చిత్ర యూనిట్‌ను కోరినట్టు తెలుస్తుంది.

స్టార్ హీరోల సినిమాకి కొంచెం ఎర్లీ గానే ప్రమోషన్లు మొదలవుతాయి. కానీ గుంటూరు కారం చిత్రానికి అలా చేయొద్దని తెలియజేశారట మహేష్. వినాయక చవితి రోజు సినిమా యూనిట్ టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభిద్దాము అని అనుకున్నారట. కానీ మహేష్ బాబు నిర్ణయం తరువాత వినాయక చవితి రోజు కేవలం ఒక లిరికల్ పాటని విడుదల చేయడానికి సిద్ధం అయ్యారట.అయితే మహేష్ తన సినిమా కోసం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని సందేహాలు అందరిలో వస్తున్నాయి.

మరి కొంతమంది మాత్రం సినిమాపై ఎలాంటి అచనాలు పెంచకుండా సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టాలని మహేష్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మరి కొంతమంది ఈ సినిమా రిలీజ్ డేట్ ఆలస్యం కావడంతో మహేష్ చిన్నగా ప్రమోషన్స్ చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు వద్దు అని చెప్పవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇక మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్లు ఎప్పుడు మొదలవుతాయో.. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.