యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఒక భారీ హీట్ కోసం ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా శర్వకు మంచి హీట్ అన్నది లేదు. రీసెంట్ గా బేబీ ఆన్ బోర్డు అనే సినిమాని కూడా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది శర్వానంద్ ఒక ఇంటివాడయ్యాడు.
పెళ్లి తర్వాత కథలను ఎంచుకునే విధానంలో శర్వ చాలా మార్పులు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇవన్నీ పక్కనపడితే ప్రస్తుతం శర్మానంద్కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ యంగ్ హీరో సర్జరీ కోసం అమెరికా వెళ్తున్నట్లు సమాచారం అందుతుంది. జాను సినిమా సమయంలో శర్వకు పెద్ద యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
అప్పుడు జరిగిన ప్రమాదంలో తగిలిన గాయాలు తగ్గినప్పటికీ కొన్ని నెప్పులు మాత్రం అలాగే ఉన్నాయట. వాటికి సర్జరీ చేయించుకునేందుకు శర్వానంద్ మరోసారి అమెరికా వెళుతున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శర్వానంద్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.