టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మేనలుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన మూవి బ్రో. ఈ మూవీలో ప్రియ ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్గా నటించారు. తమిళం సూపర్ హిట్ మూవీ వినోదయ సీతమ్కి ఇది రీమేక్. మాతృకలో సినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖనీ తెలుగులోను దర్శకత్వం వహించాడు. జులై 28న థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు రాబట్టడంలో విఫలమైంది.
డైరెక్టర్ సినిమా కథను లైట్ తీసుకుని హీరోను హైలైట్ చేసేందుకే ఎక్కువ కష్టపడ్డారని విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై స్పష్టత వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాను భారీ ధరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 25 నుంచి నెట్ ఫిక్సెలో అందుబాటులోకి రానుంది. అంటే ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు బ్రో సిద్ధమైంది. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవారు.
లేదంటే మరోసారి బ్రో సినిమాని చూడాలనుకునేవారు. ఈ శుక్రవారం ఓటిటి లో చూడవచ్చు. బ్రో సినిమా విషయానికి వస్తే.. బ్రహ్మానందం, రోహిని, వెన్నెల కిషోర్, రాజా చేంబోలు తదితరులు ముఖ్య పాత్రలో పోషించారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే, మాటలు అందించాడు. తమన్ సంగీతం అందించగా నవీన్ నూలి ఎంటర్టైనర్గా వ్యవహరించాడు.