తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా సమంత రూత్ ప్రభు హీరోయిన్గా నటించిన మూవీ ఖుషి. ఈ మూవీ తో ఎలాగైనా హిట్ తన ఖాతాలో వేసుకోవాలని కసితో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన ఈ సినిమా ఫ్లాప్ అవడంతో పాటు భారీ నష్టాలను తెచ్చి పెట్టింది. దీంతో ఎలాగైనా ఖుషి సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు విజయ్. ఈ కంటెంట్ అన్ని భాషల్లో క్లిక్ అవుతుందా అనే సందేహం అందరిలో ఉంది.
విజయ్ మాత్రం ఈ సినిమాను ఎలాగైనా సక్సెస్ బాటలో నడిపించాలని హైప్ తెచ్చే ప్రయత్నంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ వచ్చింది. మొత్తంగా చూసుకుంటే ఖుషి సినిమా ఆంధ్ర ఏరియాలో రూ.20 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేస్తున్నట్లుగా సమాచారం. సీడెడ్ ఏరియాలో రూ.6 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందట. ఇక నైజాంలో రూ.15 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన ఇండియా మొత్తం చూసుకుంటే రూ.3.5 కోట్లు ఓవర్సీస్ లో రూ7.5 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా ధియేట్రికల్గా రూ.52 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా సక్సెస్ రేట్ అందుకోవాలంటే రూ.53 కోట్ల షేర్ టార్గెట్ ను అందుకోవాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా రూ.20 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడింది. దర్శకుడు శివ నిర్మాణ ఈ సినిమాను ప్యూర్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైలర్, టీజర్, సాంగ్స్ అన్ని మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటుందో..? లేదో..? చూడాలి.