మెగా ఫ్యాన్స్ గుండెలు ప‌గిలే న్యూస్‌.. గేమ్ చేంజ‌ర్ షూటింగ్ ఆగిపోయింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న మూవీ గేమ్ చేంజ‌ర్‌. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కొద్ది కొద్దిగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఎప్పటినుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

కానీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేదానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ప్రేక్షకులకు అందని ద్రాక్షలానే ఈ సినిమా రిలీజ్ డేట్ తయారైంది. ఆల్రెడీ రిలీజ్ పై తుది నిర్ణయం శంకరదే అంటూ నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు. అయితే లేటెస్ట్ గా మరో న్యూస్ ఈ సినిమా గురించి వైరల్ అవుతుంది. దాదాపు ఈ సినిమా ధియేటర్స్ లో రావడానికి మరో ఏడాది పట్టేలా ఉందట. అంటే మళ్ళీ వచ్చే ఎడాది ఆగస్ట్‌కి ఈ సినిమా రిలీజ్ కాబోతుందని న్యూస్ వినిపిస్తుంది.

పైగా ఆర్‌ఆర్ఆర్‌ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సోలో సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు ఏడాది గ్యాప్ వస్తుందని తెలిసిన మెగా ఫాన్స్ కాస్త నిరాశ పడుతున్నారు. ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉంది అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.