రాధేశ్యామ్ థియేటర్లలోకి వచ్చేందుకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ సినిమాపై అన్ని భాషలు సహా ఓవర్సీస్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి గాను యూఎస్ బాక్సాఫీస్ వద్ద బుకింగ్స్ స్టార్ట్ చేసిన వెంటనే ఏకంగా హాఫ్ మిలియన్ మార్క్ వసూళ్లు వచ్చేశాయి. రేపటికి ఇవి మిలియన్ మార్క్ను దాటేస్తాయని అంటున్నారు.
సాలిడ్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. మరి ఈ లెక్క ఇప్పుడు సాలిడ్ ఫిగర్ 4 లక్షల డాలర్స్ మార్క్ ని దాటి హాఫ్ మిలియన్ దగ్గరకి వెళ్తుందట. ఇది మంచి విషయం అని చెప్పాలి. మరోవైపు ఏపీలో టిక్కెట్ రేట్లు కూడా పెరిగాయి. ఇన్ని సానుకూలతలు ఉన్నా ఈ సినిమాకు కొన్ని కష్టాలు కూడా వెంటాడుతున్నాయి. ప్రేమకథా సినిమాగా తెరకెక్కిన రాధేశ్యామ్ మాస్కు ఎంత వరకు కనెక్ట్ అవుతుందన్న సందేహాలు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అందుకే ఈ సినిమాకు ముందుగా జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్తో పోలిస్తే తక్కువ అమౌంట్లే కట్టారట బయ్యర్లు. సినిమాకు వచ్చిన టాక్.. వసూళ్లను బట్టే మిగిలిన అమౌంట్ కడతామని నిర్మాతలకు వారు చెప్పినట్టు తెలుస్తోంది. భీమ్లానాయక్కు టాక్ బాగున్నా అనుకున్న రేంజ్లో వసూళ్లు రాక ఓవర్సీస్ బయ్యర్లు తప్పా అందరూ లాస్ అయ్యారని.. ఇప్పుడు రాధే శ్యామ్ వసూళ్లు చూశాకే మిగిలిన అమౌంట్ కడతామని బయ్యర్లు భీష్మించుకున్నారట.
తీరా ఇప్పుడు రిలీజ్ ముందు బయ్యర్లు ఇలా చేయడంతో నిర్మాతలు కూడా చేసేదేం లేక డైలమాలో పడిపోయారు. తీరా వాళ్లతో గొడవలకు పోతే సినిమా రిలీజ్ కష్టం అవుతుంది.. అందుకే సినిమా టాక్నే నిర్మాతలు నమ్ముకుని ఉన్నారు.