సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వ తీరు గురించి మాట్లాడుతూ మోహన్ బాబు పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
‘వైసీపీ వాళ్లు థియేటర్లు మూసివేస్తున్నప్పుడు మోహన్ బాబు గారు కూడా మాట్లాడాలి. ఆయనకు నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. వైఎస్ కుటుంబీకులకు మీరు బంధువులు అని చెబుతూ ఉంటారు..విన్నాను. వారికి చిత్రపరిశ్రమను హింసించ వద్దని చెప్పండి. కావాలంటే పవన్ కళ్యాణ్ ను బ్యాన్ చేసుకోండి..అతను మీరు తేల్చుకోండి…
చిత్ర పరిశ్రమ వైపు రావద్దని చెప్పండి. మీరు మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా. మీకు నైతిక బాధ్యత ఉంది. మీరు మాట్లాడాలి. ఈరోజు వైసీపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు అప్లై చేసిన రూల్.. రేపు పొద్దున మీ విద్యానికేతన్ స్కూళ్లకు కూడా అప్లై చేయ్యొచ్చు. మీ కులం సమస్య.. మా పార్టీ సమస్య కాదు..ఒకసారి అది విలువ తప్పుతున్నప్పుడు.. అది ఏదో ఒక రోజు మీకు కూడా వస్తుంది.
అందుకే చెబుతున్నా.. మోహన్ బాబు గారికి.. ఒక్క మోహన్ బాబు గారికి మాత్రమే కాదు..అందరికీ కూడా బాధ్యతగా లేకపోతే రిపబ్లిక్ తాలూకూ రాజ్యాంగ స్పూర్తిని చేజేతులా చంపేసుకున్న వాళ్లమవుతాం.’అని కామెంట్స్ చేశారు. మోహన్ బాబు ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. మోహన్ బాబు పై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వజ్రోత్సవాల సమయంలో మోహన్ బాబు చిరంజీవిని ఉద్దేశించి ఏదో కామెంట్ చేయగా.. పవన్ కళ్యాణ్ అందుకు దీటుగా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.