ప్రియమణి ప్రస్తుతం మూవీస్,టీవీషోలు తో సహా వెబ్ సిరీస్లలోనూ నటిస్తుంది. తాజాగా ఆమె బాలీవుడ్లో హిజ్ స్టోరీ అనే వెబ్ సిరీస్లో చేసింది. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో పాల్గొన్న నటి ప్రియమణి పలు ఇంట్రెస్టింగ్ సంగతులను పంచుకుంది. ఈ వెబ్ సిరీస్లో తాను సాక్షి అనే చెఫ్ పాత్ర చేసిందని,రియల్ లైఫ్లో తనకు అసలు వంట చేయడమే రాదని చెప్పింది.
అసలు నిజం చెప్పాలంటే కోడిగుడ్డు ఉడకబెట్టడం కూడా నాకు రాదు అని ప్రియమణి తెలిపింది. ఈ సిరీస్లో తాను పోషించిన చెఫ్ రోల్ ప్రేక్షకులందరికీ చాలా బాగా నచ్చుతుందని అన్నారు ప్రియమణి. ప్రస్తుతం ప్రియమణి తెలుగులో విరాటపర్వం, నారప్ప చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్లో కూడా అజయ్ దేవగణ్ తో కలిసి మైదాన్ మూవీలో చేస్తుంది.