సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన చాలా మంది ముద్దుగుమ్మలు.. మొదట్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా క్రేజ్ దక్కించుకున్న వాళ్లు ఉన్నారు. అలా.. ఇప్పటికే ప్రభాస్తో ఫౌజీ చేయనున్న ఇమన్వీ మొదలుకొని.. ఆర్జీవి – శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి, పుష్ప 2 – అంచల్ ముంజాల్, ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య.. ఇలా ఎంతోమంది హీరోయిన్లు తమ కెరీర్ ప్రారంభంలో ఇన్స్టా రీల్స్తో పాపులారి దక్కించుకున్న వాళ్లే. ఇప్పుడు.. ఆ జాబితాలోకి మరో అందాల ముద్దుగుమ్మ చేరిపోయింది. ఇక.. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే అదరగొట్టింది. ఫస్ట్ సినిమాతోనే ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది.

మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా ట్రెండ్ అయింది. ఇంతకీ ఈమె ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. హాట్ టాపిక్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. కాకినాడ పిల్ల శ్రీదేవి. కోర్ట్ సినిమాతో హీరోయిన్గా మారి అందరి హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ పూర్తి పేరు.. శ్రీదేవి ఆపళ్ళ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు instagramలో పలు రీల్స్తో మంచి పాపులారిటి దక్కించుకుంది. ఇక.. కోర్ట్ సినిమాలో అమ్మడికి అవకాశం రావడానికి కూడా ఇన్స్టాలో శ్రీదేవి చేసిన ఓ రిలే కారణమట.

ఆ రీల్ చూసి కోర్ట్ లో ఆమెకు అవకాశం కల్పించారని ఆ మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ స్వయంగా వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. కోర్ట్ తర్వాత.. శ్రీదేవి మరో తెలుగు సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా.. ఇప్పుడు ఈ అమ్మడు మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. కోలీవుడ్ నుంచి ఆఫర్ దక్కినట్లు సమాచారం. కేజీఆర్ అనే నటుడు, నిర్మాత తెరకెక్కించనున్న కొత్త సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా ఇప్పటికే సెలెక్ట్ అయింది. ఈ సినిమాలో హీరో ఎవరో ఇప్పటివరకు అనౌన్స్ చేయకపోయినా.. ఓ స్టార్ హీరో మాత్రం ఈ సినిమాలో నటిస్తున్నాడని టాక్ తెగ వైరల్ గా మారుతుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందట. ఇక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మూవీ రూపొందనుందని సమాచారం.

