లోకనాయకుడు కమలహాసన్, కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్కు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు లెజెండ్రీ యాక్టర్స్ దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కిందంటే ఒకే స్క్రీన్ పై ఇద్దరు మెరిశారంటే ఎలాంటి ఆసక్తి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఇప్పుడు ఈ ఇద్దరిని ఒకే కథలో భాగం చేసి సిల్వర్ స్క్రీన్ పై చూపించాలనే ఓ డైరెక్టర్ సాహసం చేస్తున్నాడట.
ఇంతకీ అతను ఎవరో కాదు.. లోకేష్ కనకరాజ్. రజనీకాంత్ కు కూలి సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆయన గతంలో విక్రమ్ సినిమాతో రజనీకాంత్ కూడా అదిరిపోయే బ్లాక్ హిట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే థలైవార్, లోకనాయకుడు ఇద్దరినీ కలిపి ఓ బిగెస్ట్ మల్టీ స్టారర్కు రంగం సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇక వీళ్లిద్దరి కాంబోలో సినిమా వచ్చి దాదాపు 40 ఏళ్లు గడిచిపోతుంది. ఈ క్రమంలోనే.. వీళ్లిద్దరి కాంబో సినిమాపై ఆడియన్స్లో మంచి హైప్ నెలకొంది.
వాస్తవానికి రజినీ సినీ కెరీర్ ప్రారంభమైంది కమల్ సినిమాతో. కమలహాసన్ నటించిన అపూర్వరాగంగళ్ మూవీలో కమల్హాసన్ హీరోగా నటించిన సినిమాలో రజినీకాంత్ కీలక పాత్రలో మెరుసారు. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి దాదాపు డజన్కు పైగా సినిమాల్లో ఆకట్టుకున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులుగా పేరు సంపాదించుకున్నారు. బాలీవుడ్ అమితాబ్ హీరోగా తెరకెక్కిన గిరాఫ్తార్ సినిమాలో వీళ్ళిద్దరూ చివరిసారిగా కలిసి మెరిసారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు కాంబోలో సినిమా వస్తుందంటూ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇదే వాస్తవం అయితే మాత్రం కచ్చితంగా బాక్సాఫీస్ బ్లాస్ట్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.