టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కల్లగొడుతూ వస్తున్న ప్రభాస్.. ప్రస్తుతం అర డజన్కు పైగా సినిమాల లైనప్తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా షూట్ కు లాంగ్ గ్యాప్ ఇచ్చిన డార్లింగ్.. తిరిగి సెట్స్ లో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చాడట. ఈ క్రమంలోనే ఫ్యాన్స్కు ప్రభాస్ డబల్ భోనాంజతో మొదలవబోతుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. కారణం ఒకేసారి రెండు సినిమాల సెట్స్ లోను అడుగుపెట్టి వేగంగా పని పూర్తి చేయాలని భావిస్తున్నాడట.
అలాగే నెక్స్ట్ చేయబోయే సినిమాల కోసం లైన్ వీలైనంత త్వరగా క్లియర్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇంతకీ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఆ ప్రాజెక్ట్స్ ఏంటి.. నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. తాజాగా లాంగ్ బ్రేక్ తర్వాత షూట్లో మళ్ళీ బిజీ అయిన ప్రభాస్ ది రాజాసాబ్ సెట్స్లో సందడి చేస్తున్నాడు. షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. సినిమా కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. అది కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. ఈ వారంలోనే డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేయాలని టీం ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ హనూ రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ సెట్స్లోనూ అడుగు పెట్టాడు.
వీలైనంత త్వరగా.. ఈ రెండు సినిమాలను పూర్తి చేసి ఆడియన్స్కు డబల్ ట్రీట్ ఇవ్వాలని డార్లింగ్ ఫిక్స్ అయ్యాడట. ఇక ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే.. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సెట్స్ లోకి ప్రభాస్ అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం డిఫరెంట్ మేకవర్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సెట్స్పై ఉన్న సినిమాలను పూర్తి చేసి.. తర్వాత సందీప్ రెడ్డి వంగ కోసం మేకోవర్ అవ్వనున్నాడు. స్పిరిట్ కోసం బల్క్ డేట్స్ కావాలని సందీప్ పెట్టిన కండిషన్ మేరకు.. ఇప్పటికే సైన్ చేసి.. సెట్స్పై ఉన్న సినిమాలను.. వీలైనంత త్వరగా పూర్తిచేసే పనిలో డార్లింగ్ బిజీగా ఉన్నాడు.