పవన్ ఫ్యాన్స్‌కు బ్లాస్టింగ్ అప్‌డేట్‌.. వీర‌మ‌ల్లు వార్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..!

ఎప్పుడో ఐదేళ్ల క్రితం సెట్స్‌పైకి హరిహర వీరమల్లు షూట్ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల నిన్న మొన్నటి వరకు సెట్స్‌పైన ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు.. డిప్యూటీ సిఎం అయిన త‌ర్వాత ఈ షూట్ కంప్లీట్ చేశాడు ప‌వ‌న్‌. ఈ క్ర‌మంలోనే జూన్ 12న మూవీ రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్‌ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే పోస్టర్, గ్లింప్స్‌, సాంగ్స్ అంటూ ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో జూన్ 12న సినిమా వచ్చేస్తుందని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే పలు థియేటర్ల దగ్గర బ్యానర్లు కట్టి హడావిడి కూడా ప్రారంభించేశారు.

అయితే కరెక్ట్ గా సినిమా రిలీజ్ అవుతుంది అనే సమయానికి కొద్ది గంటల ముందు సినిమా వాయిదా పడినట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు వేక‌ర్స్‌. ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న సినిమా ఎట్టకేలకు వస్తుంది అనుకునే లోపే విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాలేదని వాయిదా వేయడం అభిమానులకు నిరాశ కల్పించింది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు సరికొత్త‌ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశ్తారా అంటూ ఫ్యాన్స్ ఎదురుచూశారు. నేడు మరోసారి పవన్ వీర‌మ‌ల్లు సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని అఫీషియల్ గా ప్రకటించారు టీం. ఈ సినిమా జులై 24న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీన్ని వీరమల్లు అఫీషియల్ పేజీపై కొత్త పోస్టర్తో అనౌన్స్ చేశారు.

ఇక ఈ పోస్టర్ తో పాటే ఒక పోరాటం అధికారి కోసం.. మరో పోరాటం ధర్మం కోసం.. యుద్ధం మొదలైంది అంటూ క్యాప్షన్ జోడించారు. జ్యోతి కృష్ణ డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాబీ డియోల్ కీలక పాత్రలో మెరవనున్నారు. అయితే.. తాజాగా అనౌన్స్‌ చేసిన రిలీజ్ డేట్ లో అయినా సినిమా పక్కాగా వస్తుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. మరి సినిమా ఈసారైనా చెప్పిన డేట్ కు వస్తే.. మిగతా సినిమాల రిలీజ్ డేట్ ల పై పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. వరుసగా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి క్యూ కడతాయి.