ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ప్రతి ఒక్కరు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ..పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు.. తెగ కసిగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి సైతం ఒకరు. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ సైతం ప్రస్తుతం తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ కోసం ప్రయత్నాలు చేస్తూ రాణిస్తున్నాడు. ఇక మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్గా పాపులారిటీ దక్కించుకున్న పవన్ కళ్యాణ్.. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలతో ఎలాంటి క్రెజ్ దక్కించుకున్నాడో తెలిసిందే.
అయితే.. తర్వాత మెల్ల మెల్లగా పాలిటిక్స్లోకి అడుగు పెట్టిన పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులను నిర్వర్తిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. సమయం దొరికినప్పుడల్లా అడపాదడపా సినిమాల్లో చేస్తూ.. ఆడియన్స్కు ఆనందాన్ని కలిగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన హరిహర వీరమల్లు షూట్ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా జూన్ 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ పాత్రలో మెరవనున్నాడట. ఉన్న వారి దగ్గర కొట్టేసి.. లేని వారికి పెట్టే.. పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
మొత్తానికి ఈ సినిమాలో రెండు సీన్లు హైలైట్ అని తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ ఒక 50 మందితో ఫైట్ చేసే సీక్వెన్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందని.. సినిమాకి హైలెట్గా మారుతుంది అంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు.. సినిమా క్లైమాక్స్ పిక్స్ లెవెల్లో ఉంటుందని.. ఎవ్వరూ ఊహించని రేంజ్ లో క్లైమాక్స్ ని అద్భుతంగా ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తుంది. అంతేకాదు.. ఇప్పటివరకు పవన్ నటించిన అన్ని సినిమాల్లో ఇది చాలా స్పెషల్ అని.. పవన్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ అవుతుందంటూ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. సినిమాలో పవన్ వన్ మ్యాన్ షో చేశాడంటూ టాక్ నడుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో.. ఏ రేంజ్ లో ఆడియన్స్ను మెప్పిస్తాడు.. తెలియాలంటే సినిమా రిలీజై రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.