హిట్ ఇచ్చిన ద‌ర్శకుల‌తో వ‌న్స్‌మోర్ అంటున్న మ‌న స్టార్ హీరోస్‌.. లిస్ట్ ఇదే..!

కొత్త కొత్త కాంబినేషన్లో సినిమాలు సెట్స్‌పైకి వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే హిట్ కాంబినేషన్లో రిపీట్ అవుతూ ఉంటాయి. అలా.. ఇప్పటికే కొన్ని సీక్వెల్స్ కోసం హీరో – దర్శకుల కాంబోలు రిపీటెడ్ గా రావడం చూస్తూనే ఉన్నాం. సీక్వెల్, ఫ్రాంచైజ్‌ల‌కు అయితే తప్పకుండా అదే కాంబినేషన్లు కామన్ గా రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త ట్రైండ్‌ మొదలైంది.. ఫ్రాంచైజ్‌లు, సీక్వెల్స్ కాకున్నా సరే.. వన్స్ మోర్ అంటూ అదే డైరెక్ట‌ర్ల‌తో.. హీరోలు సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. అలా ప్రస్తుతం టాలీవుడ్ లో ఇప్పటికే హిట్ అందుకొని.. మరోసారి అదే డైరెక్టర్ తో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

Nani's next film with Dasara director Srikanth Odela titled The Paradise -  Hindustan Times

నాని – శ్రీకాంత్ ఓదెల:
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. శ్రీకాంత్ ఓదెలా కాంబోలో 2023 మార్చి 30న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన దసరా రూ. 100కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. డైరెక్టర్‌గా దసరానే శ్రీకాంత్ ఓదెలకు మొదటి సినిమా. అయితే.. ఇప్పుడు మరోసారి నాని, శ్రీకాంత్ ఓదెలకు ఛాన్స్ ఇచ్చారు. వీరిద్దరు కాంబోలో రెండో సినిమా ప్యారడైజ్‌ కూడా రూపొందుతోంది. దసరా సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి.. ఈ సినిమాకు కూడా నిర్మ‌త‌గా వ్య‌వహ‌రిస్తున్నారు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నాని సికింద్రాబాద్ కుర్రాడిగా కనిపించనున్నాడు.

స్క్రీన్ పై ఆడియన్స్ కొత్త ప్రపంచాన్ని చూసేలా శ్రీకాంత్ ఈ కథను డిజైన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమా తెలుగులోనే కాదు.. ఇంగ్లీష్, స్పానిష్ సహా ఎనిమిది భాషలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చ్ 26న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక గతంలో దసరా సినిమాతో బ్లాక్ బ‌స్టర్ కొట్టిన సెంటిమెంట్‌తోనే మళ్లీ మార్చ్ చివరి వారంలోని ది పారడైజ్‌ను మార్చ్ నెల చివ‌రి వారం రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

Balakrishna–Gopichand Malineni Film To Launch on June 8 - Andhrawatch.com

బాలకృష్ణ – గోపీచంద్ మలినేని:
నందమూరి నట‌సింహం బాలకృష్ణ, గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో 2023లో వీరసింహారెడ్డి సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య.. గోపీచంద్‌తో మరో యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల బాలకృష్ణకు.. గోపీచంద్ ఒక కథ వినిపించారట. ఆ సినిమా చేసేందుకు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంద‌ని టాక్‌.

ఇప్పటికే బాలయ్య , బోయపాటి శ్రీనుతో.. అఖండ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళ కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు వ‌చ్చాయి. ఇది నాలుగో సినిమా కావడం విశేషం. ఇక ఈ అఖండ 2 సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇక గోపిచంద్ డైరెక్ష‌న్‌లో బాలయ్య సినిమా అఖండ 2 రిలీజ్ ప‌నులు పూర్తైన త‌ర్వాత‌ సెట్స్‌ పైకి రానుందని సమాచారం. ఈ సినిమాకు.. కెవిఎన్ ప్రొడక్షన్స్ లేదా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించినట్లు టాక్.

Confident Harish Shankar waiting for Pawan Kalyan? - TeluguBulletin.com

పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్:
ఏపి డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ కాంబోలో దాదాపు 12 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక.. తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా.. అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే.. సినిమా ప్రకటించి దాదాపు మూడేళ్లు అవుతున్నా.. ఇంకా షూట్ పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇక శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై.. నవీన్ యార్నేని, వై. రవిశంకర్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.

కాగా.. ఇన్ని రోజులు రాజకీయాలతో బిజీగా ఉండడంతో సినిమా షూట్ పూర్తి కాకపోయినా.. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో రెగ్యులర్ షూటింగ్ కు సందడి కానున్నాడు ప‌వ‌న్‌. జూన్లో తిరిగి ఫుల్ ప్లెజ్డ్‌గా ఈ సినిమా ప్రారంభమవుతుందని అఫీషియల్‌గా వెల్లడించారు. ఇక గబ్బర్ సింగ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన పవన్ ఉస్తద్‌ భగత్ సింగ్ సినిమాలోని మళ్లీ పోలీస్ ఆఫీసర్గా మెరవ‌నుండ‌టం విశేషం. ఇక ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ విజయ్ తేరి సినిమాకు రీమేక్‌గా రూపొందనుందని టాక్.

SS Rajamouli's son teases details of Ram Charan's film with Sukumar: 'My  mind was blown' - Hindustan Times

రామ్ చరణ్ – సుకుమార్:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ రంగస్థలం. సుక్కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈమూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ప్రస్తుతం అటు రామ్ చరణ్, ఇటు సుక్కుమార్ పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే మరోసారి వీళ్ళిద్దరి కాంబోలో ఓ బిగ్.. బడా.. పాన్ ఇండియన్ ప్రాజెక్టును రూపొందించనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై.. నవీన్ యార్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. అయితే.. ఈ సినిమా.. అఫీషియల్ ప్రకటన వచ్చి ఏడాదిన్నర అవుతున్నా.. ఇంకా సెట్స్ పైకి రాలేదు. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా గ‌డుపుతున్న సుకుమార్.. ఇటీవల చరణ్‌తో కలిసి.. స్క్రిప్ట్ వర్క్ పై చర్చలు కూడా జరిపారు. ఇక ఈ సినిమా కూడా రంగస్థలం మాదిరిగానే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వైరల్ గా మారుతుంది.

Taxiwala (2018) - News - IMDb

విజయ్ దేవరకొండ – రాహుల్ సంకృత్యాన్:
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా 2018లో రిలీజ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ డైరెక్టర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఈ కాంబో సినిమా సెట్స్‌ పైకి రానుంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో 14వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా 19వ‌ శతాబ్దం నేపథ్యంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో కథనంగా రూపొందనుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా.. రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభం కానుంది. 1954, 78 మధ్య జరిగిన చారిత్రక సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌. ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ స్పెషల్ మేకోవర్‌కు సిద్ధం అవుతున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న ఫిక్స్ అయినట్లు సమాచారం. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇదే కాంబోలో రూపొందించడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై మంచి అంచనాలను నెలకొన్నాయి.

Nithiin next with Vikram K Kumar: New production locked?

నితిన్ – విక్రమ్ కే కుమార్:
టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ కెరీర్‌లో ఇష్క్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ. ఈ సినిమాకు విక్రమ్ కె.కుమార్ దర్శకుడుగా వ్యవహరించారు. 2012లో ఈ సినిమా రిలీజ్ అయిన బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. కాగా.. మళ్లీ 12 ఏళ్ల గ్యాప్ తో నితిన్, విక్రమ్ కే కాంబినేషన్ సెట్ అయింది. కొంత గ్యాప్‌తో డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్‌తో మళ్లీ నేను ఓ సినిమా చేయబోతున్నాను అని నితిన్ స్వయంగా వెల్లడించాడు. ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీగా లార్జ్ స్కేల్‌తో ఈ సినిమా రూపొందనుందట. తెలుగు ఆడియన్స్‌ కొత్త సినిమాలు చూసినా అనుభూతి కచ్చితంగా ఈ సినిమాతో దక్కుతుందని నితిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.