మంచు మోహన్ బాబు, విష్ణుల రేర్ రికార్డ్.. ఇండియాలోనే మొదటిసారి

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచి విష్ణుల ప్రెస్టేజ్ ప్రాజెక్టు కన్నప్ప.. ఏ రేంజ్ లో హైప్‌ను తెచ్చుకుందో తెలిసిందే. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత గాధ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్‌, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్ సెలబ్రిటీస్ అంతా కీలక పాత్రలో నటిస్తున్న క్రమంలో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాల్లో విష్ణు కన్నప్ప‌లో నటించగా.. అతని భార్యగా ప్రీతీ ముకుందన్ మెర‌వ‌నుంది.

Kannappa Movie (Jun 2025) - Trailer, Star Cast, Release Date | Paytm.com

ఇక మహాభారతాన్ని తెర‌కెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 27న గ్రాండ్ లెవెల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కాగా.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మోహన్ బాబు, విష్ణు మరో అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. మంచు మోహన్ బాబు ఎంబియు యూనివర్సిటీ బాధ్యతలు అన్నింటినీ మంచు విష్ణు చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

Mohan Babu's MB University Embroiled In A Major Controversy - Telugu News -  IndiaGlitz.com

ఈ క్రమంలోనే యూనివర్సిటీ ద్వారా ఇండియాకి ఫారెన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకువచ్చేలా విష్ణు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పెన్ యూనివర్సిటీతో ఎంబియు యూనివర్సిటీ టై అప్ చేసినట్లు మంచు విష్ణు తన ఎక్స్ వేదికగా వెల్లడించాడు. ఇండియాలోనే ఫారన్‌ ఎడ్యుకేషనల్ ప్రాసెస్ తీసుకురాబోతున్నామని.. పెన్ యూనివర్సిటీతో ఎంబియు టై అప్‌ అయిందంటూ పేర్కొన్నాడు. ఇలాంటి టై అప్ ఇండియాలోనే మొదటిసారి అంటూ చెప్పుకొచ్చిన విష్ణు.. చరిత్ర సృష్టించామంటూ ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Vishnu Manchu (@vishnumanchu)