సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్న నటినటులు ఎవరైనా.. తర్వాత చేయబోయే సినిమాల విషయంలో పెద్దగా రిస్క్ చేయడానికి ఇష్టపడరు. రొటీన్ కథలని డిఫరెంట్ వేలో నటిస్తూ.. రాణిస్తూంటారు. కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే.. ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే.. సినిమా సినిమాకు తమ క్యారెక్టర్ షేడ్స్ను మార్చుకుంటూ.. ఆడియన్స్ను మెప్పిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో ఆ లిస్టులో ఎన్టీఆర్ పేరు మొదట వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తాను నటించే సినిమా సినిమాకు క్యారెక్టర్ లో వైవిధ్యత చూపిస్తూ వస్తున్నాడు.
ఇక ఎలాంటి రిస్కీ షాట్స్ అయినా.. తారక్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే గతంలో జై లవకుశ సినిమాలో ఏకంగా ఒకేసారి మూడు క్యారెక్టర్లలో కనిపించిన సంగతి తెలిసిందే. అంత పెద్ద స్టార్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఒక సినిమాలో ఎన్ని షేడ్స్లో కనిపించడానికి అస్సలు యాక్సెప్ట్ చేయరు. కానీ.. తారక్ మాత్రం ఈ సినిమా కోసం పెద్ద రిస్క్ చేశాడని చెప్పాలి. నందమూరి అభిమానులను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఈ సాహసం ఎవరు చేయలేదు. కానీ.. తాజాగా ఇలా మూడు షేడ్స్ లో కనిపించేందుకు తెలుగు హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 సినిమాతో తన పేరు నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ లో మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే.
కాగా.. ప్రజెంట్ అల్లు అర్జున్.. అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో బన్నీ త్రిబుల్ షేడ్స్ లో కనిపించనున్నాడని టాక్. ఈ సినిమాలో బన్నీ లుక్స్ ఒక్కదానిని మించి ఒకటి పీక్స్ లెవెల్ లో ఉండబోతున్నాయట. దీనికోసం అల్లు అర్జున్ సపరేట్ డైటీషియన్ను కూడా అపాయింట్ చేసుకుని.. డైట్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. లుక్స్ కోసం ప్రత్యేకంగా ఫారెన్ కంట్రీ నుంచి డిజైనర్స్ను రప్పించాడట అట్లీ. బన్నీ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అట్లీ.. సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడని.. పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏ చిన్న లీక్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నాడు. అయినప్పటికీ అరకొర లీక్స్ బయటకు వచ్చేస్తూనే ఉన్నాయి.