ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ట్రెండు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలోనూ ఈ మల్టీస్టారర్ అనవాయితీ ఎక్కువగా ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచే మల్టీస్టారర్లు ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే కేవలం మల్టీస్టారర్ సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుని.. స్టార్ హీరోలుగా ఎదిగిన వారు ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు కూడా ఒకరు. అలాంటి శోభన్ బాబు లైఫ్లో తాను మల్టీ స్టారర్లు చేయనని ఓపెన్గా చెప్పేశారు. అంతేకాదు.. పరిచూరి బ్రదర్స్ పై ఆయన షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు. ఇంతకీ శోభన్ బాబు అంతలా హర్ట్ అవ్వడానికి కారణమేంటి.. ఎక్కడ తేడా వచ్చిందో ఒకసారి చూద్దాం.
శోభన్ బాబు మొదటి నుంచి చాలా సిస్టమాటిక్గా.. క్రమశిక్షణతో ఉంటారు. సినిమాల లైఫ్.. ఫ్యామిలీ లైఫ్ ను అసలు మిక్స్ చేయడు. ఇక సినిమాల విషయంలో కచ్చితంగా టైం పాటిస్తూ ఉండే శోభన్ బాబు.. లైఫ్ లో మనుషుల రిలేషన్షిప్ విషయంలోనూ పద్ధతి పాటిస్తాడు. అంతేకాదు సినిమా పాత్రల విషయంలో కూడా కచ్చితంగా ఉంటారు. ఈ క్రమంలోనే ఓ మల్టీస్టారర్ సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగిందని.. తన పాత్రను గొప్పగా చెప్పి తర్వాత కట్ చేసేసారని సైడ్ క్యారెక్టర్లా ఆయన పాత్ర మారిపోయిందని కోపంతో రైటర్స్ పై మండిపడటమే కాదు.. ఇకపై మల్టీ స్టారర్ చేయనంటూ ఓపెన్ గా కామెంట్స్ చేశారు. ఆ మూవీ మరేదో కాదు సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించిన మహా సంగ్రామం. పరిచేరి బ్రదర్స్ రాసిన ఈ కథ.. కోదండరామిరెడ్డి దర్శకుడుగా వ్యవహరించాడు.
1985 ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన సినిమా అప్పట్లోనే కోటి రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో శోభన్ బాబు క్యారెక్టర్ ను బాగా డల్ చేసేసారు. దీని కారణం సెన్సార్ జరిగే టైంలో అందులో సభ్యునిగా ఉన్న ఓ మిలిటరీ ఆఫీసర్ అట. ఆయన శోభన్ బాబు పాత్ర తమ నియమాకాలకు చాలా విరుద్ధంగా ఉందని.. సీన్లను ఆయన దగ్గరుండి మరి కట్ చేయించేసాడట. దీంతో.. శోభన్ బాబు పాత్రనడివి తగ్గుతూ వచ్చింది. కానీ.. ఆ విషయం తెలియని శోభన్ బాబు.. పరుచూరి బ్రదర్ తక్కువగా పాత్రను రాసారని భావించి.. వాళ్ళను కనిపిస్తే చంపేస్తా అంటూ మండిపడ్డారు. ఇకపై మల్టిస్టారర్ కూడా చేయనంటూ ప్రకటించేశారు. అయితే తర్వాత జరిగిన విషయం తెలుసుకొని పరుచూరి బ్రదర్స్ పై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నడట శోభన్ బాబు. ఈ గొడవ అప్పటితో సమసిపోయింది.