ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ హీరోయిన్ గా రష్మిక మందన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం హిందీలోనూ సత్తా చాటుకుంటుంది. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. కొన్ని రోజులుగా బాలీవుడ్ లో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. కన్నడ మూవీ కిర్రాక్ పార్టీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ నేషనల్ లెవెల్ లో ఇమేజ్ను దక్కించుకుంది.
ఇక వరుస హిట్స్తో ఫుల్ జోష్లో ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు మరో సరికొత్త రికార్డును తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇటీవల కాలంలో రష్మిక పట్టిందల్లా బంగారం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. తాను తెరకెక్కించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక నటించిన యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలు మంచి సక్సెస్లు అందుకుని హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో రష్మిక పేరు ఒక్కసారిగా మారుమోగిపోతుంది.
అమ్ముడు సాధించిన ఈ రేర్ రికార్డ్ మరే హీరోయిన్ సైతం టచ్ చేయలేకపోయిందని.. వరుసగా మూడు సినిమాలతో 500 కోట్ల క్లబ్ లోకి చేరిన ఘనత కేవలం రష్మికకు మాత్రమే సొంతం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర యానిమల్ రూ.556.36 కోట్ల వసూళ్లు సాధించింది. పుష్ప 2 హిందీ వర్షన్ రూ.830 కోట్లు, ఇప్పుడు ఛావా రూ.516 కోట్లు కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్తో సిక్కిందర్ సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈ సినిమా సైతం సూపర్ హిట్ అయితే.. రష్మిక పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిపోవడం కాయం.