ఈ ఏడాది సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ సందడి జనవరి 10 నుంచి ప్రారంభం కానుంది. స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్తో పొంగల్ సెలబ్రేషన్స్ ప్రారంభించనున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్రాజు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కీయారా అధ్వని హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్. జే. సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్ర ఖని, నాజర్, అంజలి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ నెలకొంది. అంతేకాదు.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను వేరే లెవెల్ లో ఆకట్టుకుంది.
ప్రస్తుతం ప్రమోషన్ కంటెంట్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఈ సినిమా లో.. చరణ్ను.. శంకర్ ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో.. అలా రిప్రజెంట్ చేశాడంటూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ డేనే రూ.47 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొడుతుందంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంచి టాక్ వస్తే రూ.50 కోట్ల మార్క్ను కూడా క్రాస్ చేస్తే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటివరకు టాలీవుడ్లో బిగ్గెస్ట్ సంక్రాంతి ఓపెనింగ్ సాధించిన సినిమాగా మహేష్ బాబు సరిలేరు నీకెవరు రికార్డ్ సృష్టించింది. 2020 సంక్రాంతి బరిలో ఈ సినిమా రూ.45.7 కోట్ల ఓపెనింగ్ సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోని మహేష్ సాధించిన ఈ బ్లాక్ బస్టర్ రికార్డును.. గేమ్ ఛేంజర్ బద్దలు కొడుతుందా.. లేదా.. అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అదే క్రమంలో చరణ్ ఫ్యాన్స్.. ఈ సినిమాతో మహేష్ రికార్డ్ బ్రేక్ చేస్తాడని.. చరణ్ భారీ కలెక్షన్లు కొలగొట్టడం ఖాయం అంటూ.. రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మౌత్ ఆఫ్ పాజిటివ్ గా వస్తే మాత్రం గేమ్ ఛేంజర్కు తిరిగి ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. మొత్తానికి అటు ఇండియన్ 2తో ఫ్లాప్ ఎదుర్కొన్న శంకర్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్తో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు ఇది ఎంతో ముఖ్యం కూడా. అంతేకాదు చరణ్ రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తారని మెగా ఫ్యాన్స్ అంతా ఆశపడుతున్నారు. ఏం జరుగునుందో సినిమా రిలీజై రిజల్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.