టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు తెలుగు ఆడియన్స్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల కోసం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నడంలో అతిశయోక్తి లేదు. శేఖర్ కమ్ముల.. సినిమాలు చాలా క్లాస్గా అన్ని రకాల ఆడియన్స్ను మెప్పించేలా ఉంటాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే కథలతో శేఖర్ కమ్ముల తన సినిమాలను తెరకెక్కిస్తాడు. ఇప్పటివరకు అలా ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలు మన ఇంట్లో లేదా, మన పక్కింట్లో జరిగిన కథల్లో కనిపిస్తాయి. అందమైన ప్రేమ కథలను తీస్తూ.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉండే శేఖర్ కమ్ముల ఇప్పటివరకు ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ ఇలా ఎన్నో మంచి కంటెంట్లను తెరకెక్కించి బ్లాక్ బాస్టర్లు అందుకున్నాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల స్టార్ హీరో ధనుష్తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పటివరకు శేఖర్ కమ్ముల చేసిన అన్ని కథలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ గా ఉండనుందని సమాచారం. దీనికి కుబేర్ అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నాయి. ధనుష్తో పాటు నాగార్జున కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. అంతే కాదు.. హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక ఆడియన్స్ ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ధనుష్ వర్సెస్ నయనతార వార్ సోషల్ మీడియాలో హట్ టాపిక్గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ధనుష్తో పనిచేస్తున్న శేఖర్ కమ్ముల.. గతంలో మాట్లాడుతూ నయనతార గురించి చేసిన కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి. శేఖర్ కమ్ముల మాట్లాడుతు.. అనామిక సినిమా చేయకుండా ఉండి ఉంటే బాగుండేది. రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కాగా కథ ఏదీ లేక ఖాళీగా ఉండటంతో అనామిక తర్కెక్కించా. ఇక ఈ సినిమాలో నయనతార లాంటి స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించ. అయితే నయనతార తో ఈ కథ తీయకుండా ఉండాల్సింది. అప్పటికే దేశవ్యాప్తంగా నిర్భయ ఘటన సంచలనం సృష్టిస్తుంది కనుక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలని భావించ. అయితే ఇది వర్కౌట్ కాలేదు. అసలు ఈ సినిమా పడకుండా ఉండాల్సింది అని శేఖర్ కమ్ముల కామెంట్స్ చేశారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి.