పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా.. మరో పక్కన హీరోగా.. అటు సినిమాల్లోను.. ఇట్టు రాజకీయాల్లోను క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడ్. ఇక ఆయన సినిమాలపై సంపాదించిన డబ్బులు ఆయన కంటే ఎక్కువగా జనాల కోసం ఖర్చు చేస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన విపత్కర సంఘటనలకు తన వంతు సహాయంగా రూ.10 కోట్ల డొనేషన్ ఇచ్చారు. అలా ఇప్పటికే సినిమాలకు అడ్వాన్స్ తీసుకోవడం.. జనాల కోసం ఖర్చు పెట్టడం లాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు తన కష్టార్జితంతోనే పార్టీని కూడా నడపాలి. ఈ క్రమంలోనే రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా.. సినిమాలను మాత్రం వదులుకోవడం లేదు పవర్ స్టార్.
ప్రస్తుతం ఆయన చేతిలో ఓజి, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్లు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు 50% షూట్ పూర్తి చేసుకున్న పవర్ స్టార్.. రాజకీయాలతో బిజీగా ఉండడంతో షూట్కు బ్రేక్ ఇచ్చాడు. తాజాగా హరిహర వీరమల్లు షూట్ త్వరలో పూర్తిచేసుకుని వచ్చే నెల నుంచి ఓజి షూట్ను ప్రారంభించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్లో డిసెంబర్లో అడుగుపెడతాడని సమాచారం. అయితే ఈ మూడు ప్రాజెక్టుల పూర్తి అయిన తర్వాత పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని ఆసక్తి అభిమానులలో మొదలైంది. ఈ క్రమంలోనే అత్యంత సన్నిహితులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు సంబంధించిన అన్ని సినిమాలు సెట్ చేసే పనిలో గత ఐదేళ్ల నుంచి బిజీగా గడుపుతున్నాడట. వకీల్ సాబ్, భీమ్లా నాయక, బ్రో లాంటి సినిమాలను ఆయనే సెట్ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే ఇప్పుడు పవన్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ కూడా త్రివిక్రమ్ లైన్లో పెట్టాడు. ఈ క్రమంలోనే మరో రెండు క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్లని లైన్లో పెట్టినట్లు సమాచారం. పవన్ – అట్లీ కాంబోలో సినిమా రూపొందనుందని.. చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందిస్తున్నాడట. ఈ క్రేజీ కాంబినేషన్ని పవన్తో సెట్ అయ్యేలా త్రివిక్రమే చేశారని.. అలాగే సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్తో రాబోయే రోజుల్లో పవన్ సినిమా ఉండబోతుందని.. ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్ కథ అందించనున్నట్లు సమాచారం.