నందమూరి నటసింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోను ఏ రేంజ్లో సక్సెస్ చేస్తున్నాడో తెలిసిందే. ఈ షోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. బుల్లితెర ఆడియన్స్కు కూడా ఈ షోతో మరింత దగ్గరైన బాలయ్య.. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లతోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అష్టాపబుల్ సీజన్ 4ను కూడా ప్రారంభించినట్లు తాజాగా అఫీషియల్ అనౌన్స్ చేశారు. ఇక ఆహా ప్లాట్ఫామ్పై ఈ షో టెలికాస్ట్ కానుంది.
ఇలాంటి క్రమంలో బాలయ్య టాక్ షోకు పోటీగా రానా మరో టాక్ షోను ప్రారంభించనున్నాడట. అమెజాన్ ప్రైమ్ లో ఈ టాక్స్ షో టెలికాస్ట్ కానుందని సమాచారం. ప్రముక టాక్షో ఫస్ట్ ఎపిసోడ్ కు టాప్ స్టార్స్ రాంగోపాల్ వర్మ, రాజమౌళి గెస్ట్లుగా హాజరవుతున్నారని.. సెకండ్ ఎపిసోడ్ కు చైతన్య, శోభిత గెస్ట్లుగా వచ్చి సందడి చేయనున్నారని సమాచారం. అమెజాన్ ప్రైమ్ ఓటిటి సంస్థ.. గెస్ట్ల విషయంలో అసలు రాజిపడే అవకాశం లేదంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక గతంలో రానాకు టాక్ షో హోస్ట్గా వ్యవహరించిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఈ షో కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. ఈ షో సక్సెస్ అయితే రానా క్రేజ్ మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇక రానా ఓవైపు వరస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతూనే.. మరోవైపు ఈ షోకు హోస్ట్గా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలుషోలకు హోస్ట్గా వ్యవహరించిన రాణా.. ఎంతో మందితో ప్రశంసాలు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరోను అభిమానించే అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇక రానా ఫ్యూచర్ లో హోస్ట్గా వ్యవహరించిన ఈ షో ఎలాంటి రిజల్ట్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.