బుల్లితెరపై ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే విధంగా.. పండగలకు సెలబ్రేషన్స్లో భాగంగా.. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేశారు. జబర్దస్త్ కమెడియన్తో పాటు.. స్టార్ హీరోయిన్లు బుల్లితెరపై సందడి చేస్తూ ఆడియన్స్కు పండుగ ట్రీట్ ఇస్తారు. ఈ క్రమంగానే దీపావళిలో యాంకర్ అనసూయ, నటి మంచు లక్ష్మి లతో సూపర్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ స్పెషల్ ఈవెంట్లో అనసూయ, మంచు లక్ష్మి ఒకరికి ఒకరు మాస్ వార్నింగ్ ఇచ్చుకుంటూ రచ్చ చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈసారి దీపావళిని ప్రేక్షకుల్లో మరింత ఎంటర్టైన్మెంట్ నింపేందుకు.. ఈటివి దీపావళి మోత మోగిపోద్ది పేరుతో స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది.
అనసూయని అను బాంబ్.. మంచు లక్ష్మిని లక్ష్మీబాంబ్ అంటూ వీరిద్దరి మధ్యన ఓ ఫైట్ జరగబోతున్నట్లు ప్రోమోని డిజైన్ చేశారు. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోగ్రాం కోసం మంచు వారి ఫైర్ బ్రాండ్ లక్ష్మి, యాంకర్ అనసూయలను స్పెషల్ గెస్ట్లుగా పిలిచారట. అతిధులుగా వచ్చిన వీరి మధ్యన పోటీ ఉండనుందని సమాచారం. ఇక అనసూయ సెట్స్లో ఎంట్రీ ఇస్తూ.. దీపావళికి మోతమోగిపోద్ది అంటూ కామెంట్స్ చేయగా.. ఇక్కడ లక్ష్మీబాంబ్ పేలిందంటే సెట్ దద్దరిల్లిపోద్దంటూ మంచు లక్ష్మి కామెంట్స్ చేసింది. ఇక షోలో ఇద్దరి ఎంట్రీ హైలైట్ గా నిలిచింది. మంచు లక్ష్మిపై అనసూయ సెటైర్ వేస్తూ.. ఇక్కడ అను బాంబ్ పేలితే సెట్టే ఉండదు అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది.
ఈ ప్రోగ్రాం మంచు లక్ష్మి, అనసూయలతో పాటు.. యాంకర్ శ్రీముఖి హోస్ట్గా వ్యవహరించనుంది. అలాగే ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్, సీరియల్ యాక్టర్ మానస్, పండు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన పల్లవి ప్రశాంత్.. అలాగే బుల్లితెర సీరియల్ గ్రూప్, జబర్దస్త్ కమెడియన్స్ అంతా పాల్గొని సందడి చేయనున్నారు. స్కిట్స్, సాంగ్స్, డ్యాన్స్లతో ఊర మాస్ లెవెల్లో ఈషో ఆడియన్స్ను ఆకట్టుకొనుంది. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి, అనసూయ మధ్య ఎలాంటి వార్ ఉండబోతుందో.. ప్రోగ్రాం లో వీళ్ళ డైలాగ్స్ ఎలా ఉండనున్నాయి.. సెలబ్రిటీస్ ఏ విధంగా రచ్చ రంబోలా చేస్తారో చూడాలని ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.