టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాల్లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. ట్రిపుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత.. ఎన్టీఆర్ సోలోగా వచ్చి.. దేవరతో భారీ సక్సెస్ అందుకోవడం విశేషం. అంతేకాదు రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను కూడా తారక్ తన సినిమాతో బ్రేక్ చేసి రికార్డ్ సృష్టించాడు. ఇక రిలీజ్కు ముందే ఎన్నో సంచలనాలు సృష్టించిన దేవర.. రిలీజ్ తర్వాత కూడా కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది.
ఇప్పటికే ఏకంగా రూ.510 కోట్ల గ్రాస్ను రాబట్టి.. సంచలన సక్సెస్ అందుకుంది. అంతేకాదు ఇప్పటికీ ఇంకా సినిమా కలెక్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క దేవర రిలీజై 18 రోజులు పూర్తయిన.. ఆంధ్ర, తెలంగాణలో కచ్చితంగా రోజుకు కోటి రూపాయల వసూళ్లను సాధించి రికార్డ్ సృష్టించింది. కోవిడ్ తర్వాత ఈ రేంజ్లో కలెక్షన్లు రాబట్టిన మొదటి సినిమాగా దేవర రికార్డు సృష్టించింది. సీరియల్ ఏరియా కలెక్షన్ల విషయంలోనూ అరుదైన ఘనతను దక్కించుకుంది. ఏకంగా సీడెడ్లో రూ.30 కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది.
ఇక సీడెడ్ లో రాజమౌళి సినిమాల తర్వాత ఈ రేంజ్లో కలెక్షన్లు రాబట్టిన సినిమా దేవర. ఇక సీడెడ్ ఏరియాలో రూ.30 కోట్లు కలెక్షన్లు దాటిపోయిన రెండు సినిమాలు ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెకండ్ పార్ట్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు షూట్ చేసేశారు. మిగతా షూటింగ్ను త్వరలోనే జరుపుకోనుంది. దేవర పార్ట్ 1తో పోల్చితే పార్ట్ 2 మరింత ఆసక్తిగా ఉటుందని కొరటాల వెల్లడించాడు. ఎన్టీఆర్ పూర్తి నట విశ్వరూపాన్ని సీక్వెల్లో చూడబోతున్నాడు అంటూ ఆయన వర్ణించాడు. దీంతో దేవర సిక్వెల్ పై కూడా ఆడియన్స్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి.